Tuesday, December 22, 2020

తీక్షణదంష్ట్ర కాలభైరవాష్టకం. Tekshnadamstra KalaBhairava Astakam Telugu.

ఓం యంయంయం యక్షరూపం దశదిశివిదితం భూమికం పాయమానం
సంసంసం సంహారమూర్తిం శిరముకుటజటా శేఖరం చంద్రబింబం ।
దందందం దీర్ఘకాయం విక్రితనఖ ముఖం చోర్ధ్వరోమం కరాలం
పంపంపం పాపనాశం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ ॥ 1 ॥

రంరంరం రక్తవర్ణం కటికటితతనుం తీక్ష్ణదంష్ట్రాకరాలం
ఘంఘంఘం ఘోష ఘోషం ఘ ఘ ఘ ఘ ఘటితం ఘర్ఝరం ఘోరనాదమ్ ।
కంకంకం కాలపాశం దృక దృక దృకితం జ్వాలితం కామదేహం
తంతంతం దివ్యదేహం ప్రణమత సతతం, భైరవం క్షేత్రపాలమ్ ॥ 2 ॥

లంలంలంలం వదన్తం ల ల ల ల లలితం దీర్ఘ జిహ్వా కరాళం
ధుం ధుం ధుం  ధూమ్రవర్ణం స్ఫుట వికటముఖం భాస్కరం భీమరూపమ్ ।
రుంరుంరుం రుండమాలం రవితను నియతం తామ్రనేత్రం కరాళం
నంనంనం నగ్నభూషం ప్రణమత సతతం, భైరవం క్షేత్రపాలమ్ ॥ 3 ॥

వంవంవం వాయువేగం నతజనసదయం బ్రహ్మపారం పరన్తం
ఖంఖంఖం ఖడ్గహస్తం త్రిభువనవిలయం భాస్కరం భీమరూపమ్ ।
చంచంచం చలిత్వాచల చల చలితా చాలితం భూమిచక్రం
మంమంమం మాయి రూపం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ ॥ 4 ॥

శం శం శం శఙ్ఖహస్తం శశికరధవళం మోక్ష సంపూర్ణ తేజం
మం మం మం మం మహాన్తం కులమకులకుళం మంత్రగుప్తం సునిత్యమ్ ।
యం యం యం భూతనాథం కిలికిలికిలితం బాలకేళిప్రదానం
అం అం అం అంతరిక్షం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ ॥ 5 ॥

ఖం ఖం ఖం ఖడ్గభేదం విషమమృతమయం కాలకాలం కరాళం
క్షం క్షం క్షం క్షిప్రవేగం దహదహదహనం తప్తసన్దీప్యమానమ్ ।
హౌం హౌం హౌంకారనాదం ప్రకటితగహనం గర్జితైర్భూమికమ్పం
వంవం వం వాలలీలం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ ॥ 6 ॥

సంసంసం సిద్ధియోగం సకలగుణమఖం దేవ దేవం ప్రసన్నమ్
పంపంపం పద్మ నాధం హరిహర మయనం చంద్ర సూర్యాగ్నినేత్రం |
ఐం ఐం ఐం ఐశ్వర్యనాధం సతత భయహరం పూర్వదేవం స్వరూపం
రౌంరౌంరౌం రౌద్రరూపం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ ॥ 7 ॥

హం హం హం హంసయానం హసితకలహకం ముక్తయోగాట్టహాసం
ధం ధం ధం నేత్రరూపం శిరముకుటజటాబన్ధ బన్ధాగ్రహస్తమ్ ।
తం తం తంకానాదం త్రిదశలటలటం కామగర్వాపహారం,
భృం భృం భృం భూతనాథం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ ॥ 8 ॥

ఇత్యేవం కామయుక్తం ప్రపటతి నియతం భైరవస్యాష్టకం
యో నిర్విఘ్నం దు:ఖనాశం సురభయహరణం డాకినీశాకినీనాం |
నశ్యేద్ది వ్యాఘ్రసర్పౌహుత వహసలిలే రాజ్యశంసశ్య శూన్యం
సర్వానశ్యంతి దూరం విపద ఇది బృశం చింతనాత్సర్వసిద్ధం ||
భైరవస్యాష్టకమిదం షాన్మానం యః పఠేనరః
స యాతి పరమం స్థానం యత్ర దేవో మహేశ్వరః ||

సింధూరారుణ గాత్రం చ సర్వజన్మ వినిర్మితం ||

ఇతి తీక్షణదంష్ట్ర  కాలభైరవాష్టకం సంపూర్ణం

నమో భూతనాథం నమో ప్రేతనాథం
నమః కాలకాలం నమః రుద్రమాలమ్ ।
నమః కాలికాప్రేమలోలం కరాలం
నమో భైరవం కాశికాక్షేత్రపాలమ్ ॥

Tuesday, December 15, 2020

Vaikunta Ekadasi 2020 Dec 25th || Significance and story explained by Sr...


2020 Vaikuntha Ekadashi on Friday, December 25, 2020 Time - Vaikuntha Ekadashi falls during Dhanur solar month in the Hindu calendar. Dhanur month or Dhanurmasa is known as Margazhi month in Tamil Calendar. Vaikuntha Ekadashi is Shukla Paksha Ekadashi out of two Krishna Paksha and Shukla Paksha Ekadashis in a month. Vaikuntha Ekadashi is observed according to Solar Calendar and because of that, it might fall either in Margashirsha or in Pausha month in the Hindu Lunar calendar. In the Gregorian calendar, there might be none, one or two Vaikuntha Ekadashis in a year. Benefits - Vaikuntha Ekadashi is also known as Mukkoti Ekadashi. It is believed that Vaikuntha Dwaram or the gate of Lord's inner sanctum is opened on this day and devotees who observe fast on Vaikuntha Ekadashi attain salvation by going to Heaven. Vaikuntha Ekadashi is very important day for Tirumala Venkateswara Temple at Tirupati and Sri Ranganathaswamy Temple at Srirangam. Vaikuntha Ekadashi is known as Swarga Vathil Ekadashi in the Malayalam Calendar followed by the people of Kerala. Parana means breaking the fast. Ekadashi Parana is done after sunrise on the next day of Ekadashi fast. It is necessary to do Parana within Dwadashi Tithi unless Dwadashi is over before sunrise. Not doing Parana within Dwadashi is similar to an offense. Parana should not be done during Hari Vasara. One should wait for Hari Vasara to get over before breaking the fast. Hari Vasara is the first one-fourth duration of Dwadashi Tithi. The most preferred time to break the fast is Pratahkal. One should avoid breaking the fast during Madhyahna. If due to some reason one is not able to break the fast during Pratahkal then one should do it after Madhyahna. At times Ekadashi fasting is suggested on two consecutive days. It is advised that Smartha with family should observe fasting on the first day only. The alternate Ekadashi fasting, which is the second one, is suggested for Sanyasis, widows, and for those who want Moksha. When alternate Ekadashi fasting is suggested for Smartha it coincides with Vaishnava Ekadashi fasting day. Ekadashi fasting on both days is suggested for staunch devotees who seek for love and affection of Lord Vishnu.

Monday, December 14, 2020

Poli Swargam katha in Telugu by Hindu Priest Rama Krishna Mahankali



పోలి స్వర్గం కథ ఇదీ 🥀

కార్తికమాసం చివరికి రాగానే గుర్తుకువచ్చే కథ ‘పోలిస్వర్గం’. ఇంతకీ ఎవరీ పోలి? ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి? దానిని తల్చుకుంటూ సాగే ఆచారం ఏమిటి? అంటే ఆసక్తికరమైన జవాబులే వినిపిస్తాయి. పోలిస్వర్గం అచ్చంగా తెలుగువారి కథ. కార్తికమాసంలోని దీపం ప్రాధాన్యతనే కాదు, ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్నీ సూచించే గాధ.

అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్లు ఉండేవారట. వారందరిలోకి చిన్నకోడలైన పోలికి చిన్నప్పటి నుంచే పూజలన్నా, వ్రతాలన్నా మహా ఆసక్తి. కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా ఉండేది. తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం. ఆచారాలని పాటించే హక్కు ఆమెకే ఉందన్నది ఆమె అహంభావం. అందుకే కార్తికమాసం రాగానే చిన్నకోడలిని కాదని మిగతా కోడళ్లను తీసుకుని నదికి బయల్దేరేది. అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నదీస్నానం చేసి దీపాలను వెలిగించుకుని వచ్చేది. ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావల్సిన సామాగ్రి ఏదీ ఇంట్లో లేకుండా జాగ్రత్తపడి మరీ బయల్దేరేవారు అత్తగారు.

కార్తికమాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగనేలేదు. పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని దానితో వత్తిని చేసేది పోలి. దానికి కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపాన్ని వెలిగించేంది. ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు, దాని మీద బుట్టని బోర్లించేంది. ఇలా కార్తికమాసమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి. చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది. కార్తికమాసం చివరిరోజు కాబట్టి ఆ రోజు కూడా నదీస్నానం చేసి ఘనంగా కార్తికదీపాలను వదిలేందుకు అత్తగారు బయల్దేరింది. వెళుతూ వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటిపనులన్నీ అప్పగించి మరీ వెళ్లింది. కానీ పోలి ఎప్పటిలాగే ఇంటిపనులను చకచకా ముగించేసుకుని కార్తిక దీపాన్ని వెలిగించుకుంది.

ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంత కష్టసాధ్యమయినా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చటవేసింది. వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగి వచ్చింది. అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారూ, ఆమె కోడళ్లూ... ఆ విమానాన్ని చూసి, అది తమ కోసమే వచ్చిందనుకుని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి హతాశులయ్యారు. ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆత్రంలో పోలి కాళ్లని పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. విమానంలోని దేవదూతలు, పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకి దించేశారు.

 ఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలంతా పోలిని తల్చుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటిదొప్పలలో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. ఈ నగర జీవితంలో మనకు దగ్గరలో చెరువులు, నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి... టబ్బులలో ఈ దీపాలను వదిలేలా ఆచారం రూపాంతరం చెందింది. ఇలా వదిలిన అరటిదీపాలను చూసుకుంటూ పోలిని తల్చుకుంటారు. కార్తికమాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా, ఈ రోజున 30 వత్తులను వెలిగించి నీటిలో వదిలితే.... మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు. వీలైతే ఈ రోజున బ్రహ్మణులకు దీపాన్ని కానీ, స్వయంపాకాన్ని కానీ దానం చేస్తుంటారు.

తెలుగువారు ఇటు పోలిని, అటు దీపాన్నీ కూడా శ్రీమహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు. అందుకని చాలామంది ఈ పోలిదీపాలను అమావాస్య రోజున కాకుండా, మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు.  ఈ  అమావాస్య సోమవారం కనుక మంగళవారంనాడు   పోలి దీపాలను వెలిగించుకోవాలి. 

ఇదీ పోలిస్వర్గం వివరం! కార్తికమాసం దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తరువాత మాట. ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు, మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యంగా తోస్తుంది. భగవంతుని కొలుచుకోవడానికి కావల్సిందే శ్రద్ధే కానీ ఆడంబరం కాదని సూచిస్తుంది. అన్నింటికీ మించి ఆహంకారంతో సాగే పూజలు ఎందుకూ కొరగానివని హెచ్చరిస్తుంది. అత్తాకోడళ్ల మధ్య సఖ్యత ఉండాలన్న నీతినీ బోధిస్తోంది. అందకే ప్రతి కార్తికమాసంలోనూ, ప్రతి తెలుగు ఇంట్లోనూ... పోలిస్వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది.🙏🏻

Thursday, December 10, 2020

సమస్యనుబట్టి ప్రార్థన చేయాల్సిన శ్లోకాలు.

సూర్య గ్రహానికి

గ్రహాణాం ఆదిరాదిత్యః లోకరక్షణకారకః ।

విషమస్థాన సంభూతం పీడాంహరతుమే రవిః ॥ ఈశ్లోకాన్ని 7 వేలసార్లు జపించాలి

దానాలు త గోధులు,గోధుమపిండి పదార్థాలు రొట్టెలవంటివి,రాగివస్తువులు.

పూజలు- విష్ణుమూర్తికి పూజ,సూర్యోపాసన.

రత్నాలు- కెంపు ధరించాలి (సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)

చంద్ర గ్రహానికి

రోహిణీశః సుధామూర్తిః సుధాగాత్రః సురాశనః ।

విషమస్థాన సంభూతం పీడాంహరతుమే విదుః ।। ఈ శ్లోకాన్ని (10 వేలసార్లు జపించాలి)

దానాలు తపాలు,తెల్లబట్టలు,బియ్యం వెండి వస్తువులు.నీరుదానంచేయవచ్చులేదా నీటి ట్యాంకర్‌ కట్టించడం.శివాలయం,ఏదైనా తీర్థాలు,

పూజలు-శివారాధన,చంద్రపూజ,చంద్రుడి అష్టోత్తరశతనామాలుచదవటం

రత్నాలు- ముత్యం ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)

కుజ గ్రహానికి

భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్‌సదా ।

వృష్టికృత్‌ సృష్టిహర్తాచ పీడాంహరతుమే కుజః ॥ ఈ శ్లోకాన్ని 7 వేలసార్లు జపించాలి

దానాలు త కారం వస్తువులు,ఎర్రవస్త్రాలు,కందులు,కందిపప్పు.రక్తదానం

పూజలు-దుర్గారాధన,సుబ్రహ్మణ్యారాధన ,కుజపూజ ,కుజఅష్టోత్తరశతనామాలుచదవటం

రత్నాలు- పగడం ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)

బుధ గ్రహానికి

ఉత్పాతరూపో జగతాం చంద్రపుత్రోమహాద్యుతిః ।

సూర్యప్రియకరోవిద్వాన్‌ పీడాంహరతుమే బుధః । ఈశ్లోకాన్ని 17 వేలసార్లు జపించాలి

దానాలు తపెసలు,ఆకుపచ్చని దుస్తులు,ఎలక్ట్రానిక్‌వస్తువులు,రోగులకు మందులు ఇవ్వడం,

రత్నాలు- పచ్చ (దీన్నేమరకతం అంటారు) ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)

పూజ.విష్ను ఆరాధన,వణిగింద్రపూజ,కుబేరపూజ ఆయాదేవతలఅష్టోత్తరశతనామాలుచదవటం

గురు గ్రహానికి

దేవమంత్రీవిశాలాక్షః సదాలోకహితేరతః ।

అనేకశిశ్య సంపూర్ణః పీడాంహరతుమే గురుః॥ ఈశ్లోకాన్ని 16 వేలసార్లు జపించాలి

దానాలు త పుస్తకాలు,బంగారువస్తువులు,తీపి పిండివంటలు,పట్టుబట్టలు.పండ్లు.

పూజలు.హయగ్రీవ,సరస్వతీ,లలితా ,బుధగ్రహాల పూజలు ఆయాదేవతలఅష్టోత్తరశతనామాలుచదవటం.

రత్నాలు- పుష్యరాగం ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)

శుక్ర గ్రహానికి

దైత్యమంత్రీ గురుస్తేషాం ప్రాణదశ్చమహామతిః ।

ప్రభుస్తారాగ్రహాణాంచ పీడాంహరతుమే భృగుః ॥ ఈ శ్లోకాన్ని 20వేలసార్లు జపించాలి

దానాలు తచక్కెర,బబ్బెర్లు,అలంకరణ వస్తువులు.పూలు.ఆవు

పూజలు.లలితా ,కాలీ ,శుక్రగ్రహంపూజ చేయడం ఆయాదేవతల అష్టోత్తరశతనామాలుచదవటం

రత్నాలు- వజ్రం ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)

శని గ్రహానికి

సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః ।

మందచారప్రసన్నాత్మా పీడాంహరతు శనిః ॥ ఈ శ్లోకాన్ని 19 వేలసార్లు జపించాలి

దానాలు తవాడుకున్నవస్త్రాల్లోచినిగిపోనివస్త్రాలు,నల్లని వస్త్రాలు,నూనె,నువ్వులుండలు.అవిటివారు,రోగులకుమందులు,ఆహారం ఇవ్వడం,సిమెంట్‌,నేరేడుపండ్లు,దానంచేయడం,నువ్వులనూనెతో శరీరాన్ని రుద్ది తర్వాత స్నానం చేయడం.

పూజలు,రుద్రాభిశేకం వేంకటేశ్వరారాధన శనివారం వ్రతం పూజలు ఆయాదేవతల అష్టోత్తరశతనామాలుచదవటం.

రత్నాలు- నీలం(దీన్నే ఇంద్రనీలం అంటారు) ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)

రాహు గ్రహానికి

అనేకరూప వర్ణైశ్చ శతశఃఅథసహస్రశః ।

ఉత్పాత రూపోజగతాం పీడాంహరతుమే తమః ॥ ఈ శ్లోకాన్ని 18 వేలసార్లు జపించాలి

దానాలు తముల్లంగివంటి దుంపలు ,మినప్పప్పుతో చేసినవడలు,మినుములు,ఆవాలు

పూజలు,దుర్గారాధన,కాలసర్పపూజలు,సుబ్రహ్మణ్య ,రాహు దేవతలపూజలు ఆయాదేవతల అష్టోత్తరశతనామాలుచదవటం

రత్నాలు-గోమేధికం ధరించాలి (సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)

కేతు గ్రహానికి

మహాశిరో మహావక్త్రో దీర్ఘదంష్ట్రోమహాబలః।

అతనుశ్వ ఊర్ధ్వ కేశశ్చ పీడాం హరతుమే శిఖీ ॥ ఈ శ్లోకాన్ని 7 వేలసార్లు జపించాలి

దానాలు ఉలవలు,మిక్స్‌డ్‌ కలర్స్‌ వస్త్రాలు,ఆహారం,

పూజలు,దుర్గారాధన,కాలసర్పపూజలు,సుబ్రహ్మణ్య ,రాహు దేవతలపూజలు ఆయాదేవతల అష్టోత్తరశతనామాలుచదవటం

రత్నాలు- వైఢూర్యం ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)

విశేషాలు (సమస్యనుబట్టి ప్రార్థన చేయాల్సిన శ్లోకాలు ఇచ్చాము)

వివాహం కానివారికి,(మగవారికి)

పత్నీం మనోరమామదేహి మనో వృత్తాను సారిణి,

తారిణిం దుర్గ సంసార సాగరస్య కులోద్భవాం.

వివాహం కానివారికి,(స్త్రీలకు)

కాత్యాయనీ మహామాయే మాహా యోగిన్యధీశ్వరీ

నందగోపసుతం దేవి పతింమే కురుతేనమః

సంతానం లేనివారికి

(మర్రి,మామిడి,మేడి,జువ్వి,రావి వంటి పుణ్యవృక్షాలకు ప్రదక్షిణచేయడం,ఎక్కువసేపు గడపడం వల్ల గర్భసంబధ రోగాలు తగ్గుతాయి)

దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే

దేహిమే తనయంకృష్ణ త్వామహం శరణం గతః ॥

నమోదేవ్యై మహాదేవ్యై దుర్గాయై సతతంనమః।

పుత్రసౌఖ్యం దేహిదేహి గర్భరక్షాంకురుష్వనః॥

ఉద్యోగం లేనివారుంప్రమోషన్‌ కోరేవారు

శ్రీ రాజమాతంగ్యై నమః

ఇంటిలో అశాంతి తొలగుటకు

ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం।

లోకాభిరామంశ్రీరామం భూయో భూయో నమామ్యహం

Saturday, September 26, 2020

*శ్రీ సూక్తశ్లోకాలు

*శ్రీ సూక్తశ్లోకాలు


  *శ్లో  హిరణ్య వర్ణామ్ హరిణీమ్ సువర్ణ రజత స్రజామ్*
       *చంద్రామ్ హిరణ్మయీమ్ లక్ష్మీమ్ జాతవేదో మమావహః*

 *హిరణ్య వర్ణామ్* ~ కిరణమయములగు వర్ణము గలది; అనగా సూర్యుని కిరణములలో గల అన్ని వర్ణములు తన రూపముగా గలది.

*హరిణీమ్* ~ ఆడులేడివలె చపలమైన గమనముగలది.

*సువర్ణ రజత స్రజామ్* ~ మంచి వర్ణములను పుట్టించు వెండి వంటి స్వచ్చమైన కిరణము.

 *చంద్రామ్* ~ ఆహ్లాదకరమైనది

*హిరణ్మయీమ్* ~ కిరణముల రూపము గలది. హకార రేఫములే తన రూపములుగా గల మంత్ర మూర్తి.

 *లక్ష్మీమ్* ~ లక్ష్మి

*జాతవేదః* ~ తనయందు వేదము పుట్టినవాడు. అనగా జీవులలో 'నేను '  అను ప్రజ్ఞ గానున్న  పురుషమూర్తి యగు అగ్ని, వానినుండియే వానికి సమస్త జ్ఞానము భాసించును.

*మమ ఆవహః*~ అట్టి జాతవేదుడు నాకు లక్ష్మీ వైభవము సాధించి పెట్టును గాక అని  అర్థము.

      కిరణముల రూపము గలది;  హకార రేఫములే తన రూపములుగా గల మంత్ర‌మూర్తి; లక్ష్మీ చిహ్నములు గలది. సూర్యకిరణముల వలననే ఆకారాలు, రంగులు మున్నగు రూప చిహ్నములు అవతరించుచున్నవి. అలాగే శబ్ధమయములగు నామచిహ్నములునూ అవతరించుచున్నవి‌ ~ తనయందు వేదములు పుట్టినవాడు‌ ~ అనగా జీవులలో నేను అను  ప్రజ్ఙగా ఉన్న పురుషమూర్తి అగు అగ్ని వాని నుండియే వానికి సమస్త జ్ఙానము భాసించును. నాకు సాధించి పెట్టును గాక! అనగా అట్టి  జాతవేదుడు నాకు లక్ష్మీ వైభవాన్ని సాదించి పెట్టును గాక! అని అర్థము.

*శ్రీ సూక్త  శ్లోకం   ~2*

 *తామ్ మ ఆవహ జాతవేదో లక్ష్మీ మనపగామినీమ్*
*యస్యామ్ హిరణ్యాం విందేయం గామశ్వం పురుషానహమ్*

      వేదమునందు పుట్టిన వెలుగైన అగ్నీ!  ఎన్నడునూ నన్ను విడిచిపోని లక్ష్మిని నాకు ఆవహింప జేయుము. దానివలన కిరణముల బంగారము, గోవులు, అశ్వములు,  పురుషులు(పరివారము) అను సంపదను నేను పొందగలను.

 *జాతవేదః* ~  ఓ జాతవేదుడా!

 *అనపగామినీం* ~ విడిచిపోని యామెను

  *తామ్ లక్ష్మీమ్* ~ ఆ లక్ష్మిని

   *మే* ~ నాకు

   *ఆవహ* ~ ఆవహింప జేయుము

   *యస్యామ్*~ ఎవని వలన

   *హిరణ్యం*~ కిరణముల వెలుగుల సిరులను

    *గాం* ~ గోవును

    *అశ్వం*~ గుర్రమును

    *పురుషాన్* ~ స్థ్రీ పురుషులను (పరిచారమును)

    *అహమ్*~  నేను

    *విందేయమ్* ~ పొందగలను.

      జాతవేదుడు అనగా వేదములయందు పుట్టినవాడు, వేదములను పుట్టించువాడు. చక్కగా సంస్కరింపబడిన మనలోని ప్రజ్ఞలే మానవుడు వ్రాయని గ్రంధాలు. అనపగామిని అనగా విడిచిపోవనిది. సంస్కారమున్నవాని చుట్టునూ ఆవరించియుండు శాంతిప్రదమగు సాన్నిధ్యము ~ దీనినే వర్చస్సు, ఇష్టదేవత,  కళ అని అంటారు.  ఇదే సర్వ సమర్ధతలకూ కారణము. ధర్మశీలుని ఆవరించి పరులకుపకరించు ఆత్మవిశ్వాసముగా ఇది వర్తించును. ఆవహింపజేయుట అనగా దేవతను ఆవాహనము చేయుట. ఇది కోరినవారు  నిత్యార్చనలో దేవతలకు పూజానంతరము ఉద్ద్వాసనము చెప్పరాదు.  గామ్ ~ గోవును ~ అశ్వం ~ గుర్రాన్ని అనగా ప్రాణమయ శరీరమనబడు అగ్నిని ~ దీనినే అశ్వర్థమందలి అశ్వర్తమందలి అశ్వర్తమందలి అశ్వమని వేదాలకవి సంప్రదాయము చెప్పును. పురుషాన్ అనగా పురుషులనూ పురుషసూక్తమున చెప్పబడిన పపరమపురుషుని రూపాలుగా నరులను ఆదరిించుట!!

*శ్రీ సూక్తము ~ శ్లోకం ~ 3:*

*అశ్వపూర్వాం  రథమధ్యాం హస్తినాద ప్రభోధినీమ్*
 *శ్రియం దేవీం ఉపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతామ్:*

        తొలుత అశ్వములు, నడుమన రథములు, కొసకు ఏనుగులు నిలబడి శబ్దములు చేయుచుండగా మేల్కొలుపులను పొందుచూ, వెలుగుల నాశ్రయించుట్టి శ్రీదేవిని మేము ఉపాసన చేయుదుము. మమ్ము ఆ శ్రీదేవి అభిలషించి  ప్రోత్సహించును గాక!

        *అశ్వపూర్వామ్* ~ అశ్వములు తొలుతగా  గలది;

        *రథమధ్యామ్*~ రథములు   నడుమగా గలది

        *హస్తినాద*~ ఏనుగుల నాదముచే;

        *ప్రభోధినీం*~ మేల్కొలుప బడినది;

        *శ్రియం* ~ ఆశ్రయించునది;

        *దేవీం* ~ వెలుగుల రూపు గలది;

        *ఉపహ్వయే*~  ఉపాసన చేయుదును; రమ్మని  పలుకుదును;

        *శ్రీం దేవీం*~ ఆశ్రయించునది, వెలుగులు గలదియు అగు ఆ శ్రీదేవి;

        *మా* ~ నన్ను;

        *జుషతామ్*~ అభిలషించును గాక!

 *శ్రీ సూక్తము ~  శ్లోకం ~ 4:*

 *కాంసోస్మితాం హిరణ్య ప్రాకారా ఆర్ద్రామ్*
 *జ్వలంతీం తృప్తాం తర్పయంతీమ్*
  *పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే:*

         పరమపురుషుడగు నారాయణుడు, ఎవరిని తన అస్తిత్వముగా నేర్పరచుకొనెనో, అట్టి కిరణమయ ప్రాకారము రూపముగల ఆమెను, పద్మమున నిలిచిన పద్మ వర్ణ మూర్తిని అగు నామెను, శ్రీదేవిని నాయందు ఆవాహనము చేయుచున్నాను.

 *సహః* ~ అతడు, వేదపురుషుడు;

  *కాం*  ~ ఎవతెను;  అస్మితాం ~అస్తిత్వముగా, నేనున్నాను అను ప్రజ్ఙగా, సంకల్పరూపిణిగా(పొందెనో);

*హిరణ్య ప్రాకారాం*~ బంగారు వన్నె కిరణముల యావరణము గల దానిని;
*ఆర్ద్రామ్*~ ద్రవ స్వరూపిణిని;‌ లేక రస స్వరూపిణిని, ఎర్రని రంగు గూడ కలిగిన ఉదయారుణ సూర్యకాంతి గలదానిని;
*జ్వలంతీ*~ జ్వాలా రూపము గల దానిని;
*తృప్తామ్* ~ తృప్తి గల దానిని;
*తర్పయంతీం*~ తృప్తిని కలిగించుచున్న దానిని;
*పద్మే స్థితాం* ~ పద్మమునందు ఉన్న దానిని;
*పద్మ వర్ణాం* ~ తమ్మి పువ్వు రంగు కల దానిని;
  *పత్ + మ* ~ పదముల శోభతో కూడిన రంగు కల దానిని;
*తామ్ శ్రియం* ~ ఆ శ్రీదేవిని;
*ఇహ*~ ఇచ్చటకు, నాయందు స్థూల సూక్ష్మాది సృష్టి లోకమందు;
*ఉపహ్వయే* ~ సమీపమునకు పిలుచుచున్నాను.
*ఆర్ద్ర* ~ ఉదయ సూర్యరశ్మి ద్రవమువలె వ్యాపించునది యయ్యు, అగ్నిగా వేడి వెలుగుల నిచ్చునది. మరియూ ఆర్ద్ర అను నక్షత్రము లక్ష్మీ సమృధ్ధిగల సౌర కుటుంబము. దాని వెలుగును ఉపాసించుట లక్ష్మీ ప్రదము. ఇది భూమికి పగడము వలె కనిపించును. పగడముల  చెట్లు ఈ నక్షత్ర ప్రభావము వలన ఉధ్భవించుచున్నవి. కనుక పగడములు కూడా లక్ష్మీ ప్రదములే~ స్థ్రీలచే ధరింపబడును. ప్రేరేపించును గాక!

*శ్రీసూక్తము ~ శ్లోకము ~ 5*

 *చద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం*
 *శ్రియం లోకే దేవ జుష్టా  ముదారామ్*
 *తాం పద్మినీం ఈం శరణ మహం ప్రపద్యే*
  *అలక్ష్మీ ర్మే నశ్యతాం త్వాం వృణే:*

         చంద్రాత్మకమైనది, వెలుగులను వెదజల్లునది, ప్రశస్థిచే లోకమునందు (లోకములుగా) వెలుగుచున్నది, దేవతల ప్రీతిని చూరగొన్నది, ఔదార్యం గలది, పద్మ లక్షణములు గలది,  ఈం కార స్వరూపిణియగు ఆ శ్రీదేవికి నేను శరణాగతి  చేయుచున్నాను. నిన్ను  వరించుటవలన నాయందున్న అలక్ష్మి నశించు గాక!

*ప్రతిపదార్థాలు*

 *చంద్రాం* ~ చంద్రతత్వంగలది,  షోడశ కళాత్మకమైనది;
*ప్రభాసాం* ~ ప్రశస్తమైన వెలుగు గలది;
*యశసా* ~ ప్రసిధ్ధికి వలసిన లక్షణములచే;
*లోకే* ~ లోకము నందు;
*జ్వలంతీం* ~ ప్రకాశించు దానిని;
*దేవజుష్టాం* ~ దేవతల మక్కువను చూరగొనిన దాని‌ని;
*ఉదారాం*  ~ దానము చేయు గుణము కల దానిని;
 *పద్మినీం* ~ పద్మ లక్షణములు గల నామెను;
*ఈం*  ~ఈంకార స్వరూపిణిని;
*తాం*~ ఆమెను ( అట్టి శ్రీదేవిని);
*అహమ్* ~ నే‌ను శరణము పొందుచున్నాను;
*త్వాం* ~ ‌ని‌‌న్ను;
*వృణే*  ~  వరించుట యందు ( ఆవరించుట యందు);
 *మే*  ~ నాయొక్క;
*అలక్ష్మీః*~  అశుభ లక్షణము;
*నశ్యతాం*~ నశించును గాక!

*శ్రీ సూక్తము ~  శ్లోకం ~ 6:*

 *ఆదిత్య వర్ణే తపసోధిజాతో వనస్పతి స్తవ వృక్షోధ బిల్వః,*
*తస్య ఫలాని తపసా నుదంతు మాయాంతరాయస్చ బాహ్యా అలక్ష్మీ:*

       *ఆదిత్యుని వర్ణముతో వెలుగొందు ఓ శ్రీదేవీ! నీ తపస్సుచేత అధిష్టించి పుట్టినది బిల్వము అను వనస్పతి.  దాని ఫలములు మా తపస్సు చేత,*
*మాలోని మాయా సంభవములైన లోపలి, వెలుపలి అవలక్షణములను*
*తొలగించు గాక!*

*ప్రతిపదార్థాలు*

 *ఆదిత్యవర్ణే*  ~ ఆదిత్యుని వర్ణము గలదానా;
 *తపసః* ~ తపస్సులకు;
 *అధిజాతః*~ అదిష్టానముగా పుట్టినది యగు వనస్పతి అను జాతికి చెందిన;
 *వృక్షః* ~ వృక్షము;
 *అథః*~ అటుపైన ( తపస్సునకు అనంతరముగా పుట్టిన);
 *బిల్వ* ~ మారేడు చెట్టు;
 *తస్య ఫలాని* ~ దానియొక్క ఫలములు;
 *తపసా*~ తపస్సు చేత;
*అంతరాయా + చ* ~ లోపలి నుండీ కలుగుననియు;
*బాహ్యా + చ* ~ పరిసరములనుండి కలుగుననుయు అగు;
*అలక్ష్మీః* ~ అలక్ష్మీ కరములగు;
 *మాయాః* ~ మాయా సంభవ లక్షణములను;
 *నుదంతు* ~ పోగొట్టును గాక: నశించునుగాక!

*శ్రీ సూక్తము ~  శ్లోకం ~ ~ 7:*

*ఉపైతు మాం దేవ సఖః కీర్తిశ్చ మణినా సహ*
*ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్    కీర్తి  వృధ్ధిం దదాతు మే;*

*భావము*

       *కీర్తి తోడను, మణులతోడను కలిసి దేవతలకు సఖుడగు కాముడు నా కెదురు ‌వచ్చి సమీపించుగాక! నే నుధ్భవించిన ఈ రాష్ట్రము‌ నందతడు నాకు సమృధ్ధిని కలిగించును గాక‌.*

 *దేవసఖః* ~ దేవతలకు సఖుడు అగు కాముడు;

      *కీర్తిః + చ*~  కీర్తియునూ;

      *మణినా సః*~ మణితో కూడా;

      *మాం*~ నన్ను;

      *ఉప + ఏతు*~ సమీపించును గాక;

      *అస్మిన్ రాష్ట్రే*~ ఈ రాష్ట్రము నందు;

      *ప్రాదుర్భూతః + అస్మి*~ ఉధ్భ వించితిని;

      *మే* ~ నాకు;

      *కీర్తిం*~ ఆ కాముడు కీర్తిని;

      *వృధ్ధిం* ~ సంవృధ్ధిని;

      *దదాతు* ~ ఇచ్చును గాక!

*శ్రీసూక్తము ~ శ్లోకము ~ (8)*

*క్షుత్పిపాసా మలామ్ జ్యేష్టాః అలక్ష్మీ  నాశయామ్యహం*
*అభూతిః అసమృధ్ధిం చ సర్వాః నిర్ణుద మే గృహాత్:*

        *ఆకలి దప్పుల మలిన లక్షణము గల జ్యేష్టా దేవి అనబడు అలక్ష్మిని నేను నశింపజేయుదును. సంపద, సమృధ్ధి నా ఇంటి నుండి* *తరగకుండా అనుగ్రహించి నీవును అలక్ష్మిని పోగొట్టుము.*

 *క్షుత్*~ ఆకలి;
 *పిపాసా* ~ దప్పిక;
 *మలాం* ~ మల స్వభావము గల దానిని;
 *జ్యేష్టాః*~ జ్యేష్టాదేవిని అనగా దారిద్య దేవతను;
 *అలక్ష్మీ*~ శుభ లక్షణములకు వ్యతిరేకమైన దానిని;
 *అహం* ~ నేను;
 *నాశయామి* ~ నశింపజేయుచున్నాను;
*అభూతిః* ~ సంపద లేకుండుటను;
 *అసమృధ్ధిం చ*~ సమృధ్ధి లేకుండుటను;
 *సర్వాః*~ సమస్త స్వరూపమగు జ్యేష్టాదేవిని;
 *మే గృహాత్*~ నా ఇంటినుండీ;
 *నిర్ణుద*~ పోగొట్టుము.

          *ఒంటికి సంభంధించినది, ఇంటికి సంభంధించినది అగు* *దారిద్ర్యమురెండు విధములు:  మొదటిది కర్మాధీనము ~ అనగా జీవుడు సత్కర్మచే నశింపజేసుకొన వలసినది. అనగా  అనుగ్రహముచే తొలగిపోవలదినది. అందు మొదటిదానిని నేను‌ తొలగించుకొందును. రెండవ దానిని నీవు తొలగింపుమని ఇందలి* *ప్రార్థన. పూర్వ కర్మ నశించుటకు సత్కర్మయూ, దైవానుగ్రహమునకు* *ప్రార్థనయూ సహజమైన పధ్ధతులు. ఇవి తారుమారు అయినచో పని చేయవు. దుష్కర్మ చేసి ప్రార్థన చేసినచో ఆపదలు తొలగవు. సత్కర్మ చేసి కలిసిరానిచో  సుఖము కలుగదు. రెండింటి సామ్యము కొరకు ఈ మంత్రమును*

*శ్రీ సూక్తము ~  శ్లోకం ~ 9:*

  *గంధ ద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం*
   *ఈశ్వరీగ్ం సర్వ భూతానాం తామిహోపహ్వయే శ్రియం:*

*గంధద్వారాం* ~ గంధమే తన ద్వారముగా కల దానిని, సుగంధముతో
కూడిన ద్వారము కల దానిని;
*దురాధర్షాం*~ తేలికగా సమీపించుటకు వీలుకాని దానిని, జంకు కలిగించుటకు సాధ్యపడని దానిని;
*నిత్యపుష్టాం*~ నిత్యమూ పుష్టియైన దానిని;
*కరీషిణీం* ~ కరములచే అనగా కిిరణములచే పొందబడిన ఈషణములు కలదానిని(ఈషణములు అనగా ఆకార రేఖలు లేక అభిలాషలు)
*సర్వ భూతానాం* ~ సమస్త జీవరాశులకు;
*ఈశ్వరీం* ~ స్ధిదేవత యైన దానిని;
*తాం శ్రియం* ~ ఆ శ్రీదేవిని;
*ఉపహ్వయే* ~ సమీపించుటకు ఆహ్వానించుచున్నాను.
సుగంధముతోకూడిన ‌ద్వారముగలది. సులభంగా సమీపించుటకు వీలు కానిది, ఎల్లప్పుడూ పుష్టిగా ఉండేది, కిరణములచే ఆకారము కట్టుకొన్నది.
సర్వజీవులకూ పరమేశ్వరి అగు నా శ్రీదేవిని మమ్ము సమీపింపుమని‌ ఆహ్వనించు చున్నాను. ఉపాసించబడును.

*శ్రీ సూక్తము ~ శ్లోకం ~ 10:*

  *మనసః కామ మాకూతిమ్ వాచః సత్య మశీ మహి*
*పశూనాం రూపమన్నస్య మయి శ్రీః శయతాం యశః:*

 *మనసః* ~ మనస్సు యొక్క;
  *కామమ్* ~ కోరికను;  అకూతిమ్ ~ కుతూహలమును;
  *వాచః* ~ వాక్కుయొక్క;  సత్యం  ~ సత్యమును;   
  *పశూనాం* ~ పశువులయొక్క;  అన్నస్య ~ అన్నముయొక్క;
   *రూపం* ~ రూపములు;  అశీమతి ~ నీ యందు రూపొందిచుకొని
    అనుభవించెదము;
    *యశః*  ~ కీర్తి స్వరూపమగు; 
   *శ్రీః* ~ శ్రీదేవి;  
  *మయి* ~ నాయందు;
   *శ్రయ తామ్*~ ఆశ్రయమును చెందునుగాక;

      *మనస్సు యొక్క కోరికను, కుతూహలమును, వాక్కు యొక్క సత్యమును, నీయందు రూపొందించుకొందుము. పశు సంపద యొక్క, అన్నము యొక్క రూపమును నీయందు రూపించుకొందుము. కీర్తి స్వరూపమగు శ్రీదేవి నా యందు ఆశ్రయము చెందునుగాక.*

       *మనస్సునకు కోరిక, కుతూహలము సహజములు. వాక్కునకు సత్యము సహజము. అసత్యమాడిన వాక్కునందు కూడా అతడు అసత్యమాడెనను సత్యము సహజముగా నుండును. వాక్కు భావ ప్రకటన స్వరూపము గనుక. ఎట్లుద్దేశింపబడిన సత్యమట్లే వ్యక్తమగుట సత్యము. ఈ సహజ సంపదను లోకదృష్టి యొక్క నానాత్వము వైపునకు చెదర నీయక నీయందు ప్రయోగింతు మని అర్థము.*

 *పశువుల యన్నము అనగా పచ్చిక, నీరు మున్నగునవి. వానిని పెట్టి* *పోషించుటవలన పశువులు గవ్య సంపద నిచ్చు‌ను గనుక, పై* *వస్తువులను సంపదయొక్క రూపములుగ దర్శించి యాదరింతుమని* *అర్థము. అనగా మంచి ఆహారాదులచే పశువులయందు భూత దయ, ఆదరము కలిగి వుండి ఈ లక్షణములను నీ రూపమున* *నర్చింతుమని అర్థము. అట్లు ప్రవర్తించిన వారి సత్ప్రవర్తనము వలన లోకమున కలుగు సత్కీర్తియే శ్రీ స్వరూపము. అట్టి స్వరూపమునకు* *ఆశ్రయమిత్తుమని ఇందలి ప్రార్థనము.*
*దీనివలన శ్రీదేవి సహజముగా గొనవలెనని కోరుకొనుట ముఖ్యము.*

*శ్రీ సూక్తము ~ శ్లోకం ~ 11:*

  *కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ*
   *శ్రియం వాసయ మే కులే మాతరం పద్మ మాలినీం:*

 *కర్దమేన*‌ ~ కర్దముని చేత; 
*ప్రజాభూతా*~ సంతతిగ పొందబడినదగు;
 *శ్రియం* ~ శ్రీదేవిని;  
*మాతరం*~ మాతృస్వరూపిణిని;
 *పద్మమాలినీం* ~ పద్మ మాల ధరించినదానిని;
 *మే కులే* ~ నా వంశమునందు;
‌  *వాసయ* ~ వసింపజేయుము;  
  *కర్దమ*~ ఓ కర్దముడా!
‌‌‌  *మయి*~ నా యందు;  
  *సంభవ*~ నీవునూ  ఉధ్భవింపుము.

 *తాత్పర్యము:*

         కర్దముడను ప్రజాపతి చేత సంతతిగ పొందబడిన సువర్ణ కర్దమ స్వరూపిణిని నాయందు కర్దమ స్వరూపిణివై యుధ్భవింపుము. ఓ కర్దమ ప్రజాపతీ! మాతృ స్వరూపిణియు, పద్మాలంకృతయు నగు శ్రీదేవిని మా వంశమునందు  వసింపజేయుము.

        కర్దముడు సృష్టి కారకులగు ప్రజాపతులలో ఒకడు. ఇతడు తన భార్యయందు  సృష్టి సమస్తమును శ్రీ కళయైన హిరణ్య కర్దమముగా నుధ్భవింప జేసెను.  ఇతని మహిమవలన  సూర్యకిరణములనుండి యుధ్భవించింన మరుత్తులు వాయువులైనవి. అవే సూర్యకిరణములనుండి పుట్టిన అగ్ని వలన వాయువులు జలములైనవి. జలము పృథ్వీ తత్వమైనది. వాయు, జల, పృథ్వీ తత్వముల సమ్మిశ్రమగు కర్దమముపై (బురదపై) సూర్య కిరణములు ప్రసరించి జీవ సృష్టిని కలిగించినవి. ఇది యంతయూ కర్దమ ప్రజాపతి  ప్రభావము. ప్రకృతి శ్రీ స్వరూపిణి గనుక కర్దముని సంతతిగా ఉధ్భవించినదని పురాణములయందు నిరూపింపబడినది.

*శ్రీ సూక్తము ~  శ్లోకం ~ 12:*

 *ఆప సృజంతు స్నిగ్ధాని చిక్లీత వస మే గృహే*
 *నిచ దేవీం మాతరం శ్రియం  వాసయ మే కులే:*

 *ప్రతిపదార్థాలు*

*స్నిగ్ధాని* ~ మెరుపుకాంతులు కలిగిన;  *ఆపః* ~ జలములు;
*సృజంతు* ~ సృష్టించుగాక;  *చిక్లీత*~ ఓ చిక్లీతుడా;
 *మే గృహే*~ నా గృహమున;  *వస*~ వసియింపుము;
*మాతరం* ~ తల్లియగు;  *శ్రియం దేవిం* ~ శ్రీదేవిని;
*మే కులే*~ నా వంశమునందు;
*నివాసయ చ* ~ నివసించునట్లు చేయుము.

 *తాత్పర్యము*

*ఓ చిక్లీతుడా ! సరసములైన జలములు సృష్టించు గాక! నీవు నా* *గృహమున వసింపుము.  మాతయైన శ్రీదేవిని నా వంశమున నిశ్చలముగా వసింప జేయుము.*
    
        *చిక్లీతుడు లక్ష్మీ పుత్రులు ముగ్గురిలో నొకడు. కర్దముడు, చిక్లీతుడు,*
*ఆనందుడు,  అను ముగ్గురూ లక్ష్మీ పుత్రులు సృష్టికి ప్రజాపతులుగా పని చేయుదురు.  కేదనము అనగా తడుపుట.  జలమునకు* *తడుప‌పు  నట్టి శక్తి నిచ్చు దేవతయే చిక్లీతుడు.  తడి యనునది జీవమునకు చిహ్నము.  దానివలననే భూమి వర్షమున తడియుట, సృష్టి  విత్తనమును‌‌‌‌   మొలకెత్తించుట జరుగుచున్నది. వర్షములు లేకుండుట క్షామమునకు సూచకము.  చిక్లీతుడు అను ప్రజాపతి వర్షముచే భూమిని తడిపి పంట పండించు దేవత. పూర్వకాలమున ఇతడు రైతుల ఇష్ట దైవముగా ఆరాధింపబడువాడు. ఇతడు ప్రసన్నుడైనచో స్నిగ్నిదములైన ఆపస్సులు ప్రసన్నములగును.  అనగా మెరుపుకాంతులతో విద్యుత్ అనబడు ప్రాణశక్తిని తమలోని అంకురశక్తిగా పీల్చుకొని భూమికి దిగివచ్చు మేఘముల జలములివి.  క‌నుకనే,  సంపదలనిచ్చుచూ లక్ష్మికి‌ రూపములై ఉన్నవి‌.  తల్లి గర్భములో జలములు కారణముగా పిండము జీవించును గనుక మాతృ స్వరూపిణియైన జలములను చిక్లీతుడు సకాలమున భూమికి గొని రావలెనని ఇందలి ప్రార్థన.*

*శ్రీ సూక్తము ~ శ్లోకం ~ 13:*

  *ఆర్ధ్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీమ్:*
 *చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహః:*

         *ఆర్ద్రాం* ~దయార్ద్ర స్వరూపిణి, రస స్వరూపిణి, ఆర్ద్రా నక్షత్రమునుండి వెలుగుచున్న మహిమ కలదానిని;

          *పుష్కరిణీం* ~ పోషణను  కలిగించునది; తెల్ల కలువలమాలను ధరించినది; పుష్కరిణి అంటే కోనేరు; అందు పోషింపబడు తెల్ల కలువ పువ్వులు కలది అని అర్థము.

          *పుష్టిం* ~ పోషణ స్వరూపిణిని;  పింగళాం ~ పింగళ వర్ణము(తేనెరంగు)
కలది;

          *పద్మమాలినీం* ~ పద్మముల మాలను ధరించినదా‌నిని;

          *చంద్రాం*~ చంద్రుని స్వరూపమైన చల్లని వెలుగులు గలదానిని;

          *హిరణ్మయీం* ~ బంగారు రంగున వెలుగొందుదానిని; కిరణ్మయ స్వరూపిణిని;

          *లక్ష్మీం* ~ శుభ లక్షణములు గలదానిని;

          *మే + ఆవహః* ~ నాయందు ఆవాహన చేయుము.

      *ఓ జాతవేదుడా!  ఆర్ద్ర స్వరూపిణియు, కలువపువ్వుల, *తమ్మిపువ్వుల*దండ ధరించినదియు, పోషణము, పుష్టి కలిగించునదియు, పింగళవర్ణము గలదియు, హిరణ్మయ మూర్తియు, చంద్రుని స్వరూపము గలదియు అగు లక్ష్మిని నాయందు ఆవహింపజేయుము.*

       *ఆర్ద్ర* అనగా *దయార్ద్ర స్వరూపిణి; రస స్వరూపిణి; ఆర్ద్రా* *నక్షత్రమునుండీ వెలుగుచున్న మహిమ కలదానిని. పుష్కరిణి అంటే కోనేరు; అందు పోషింపబడు తెల్ల కలువ పువ్వులు కలది అని అర్థము.* *చంద్రుడు తెల్లకలువలను వికసింపచేసి శోభ కలుగజేయును. కనుకనే ఇక్కడ శ్రీదేవి  వర్ణింపబడినది.*

         *గృహారామమున కోనేరు, తెల్ల కలువలుండుట లక్ష్మీప్రదము. ఆర్ద్రా నక్షత్రమున వానినారంభము చేయుట శుభప్రదము. *పింగళ* అనగా *తేనె* *రంగు కలది. తేనె లక్ష్మీకరములగు ఆహారములలో ఒకటి. దానిని సేవించుట ఆయురారోగ్య ఐశ్వర్య ప్రదము; మరియూ పింగళనాడి లక్ష్మీ* *స్వరూపము. దానినే సూర్యనాడి అని అంటారు. దాని వల్ల యోగులకు* *ఊర్ధ్వగతి. భోగమోక్షములు*

*శ్రీసూక్తము ~ శ్లోకం ~ 14:*

 *ఆర్ద్రాం యః కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీమ్*
*సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ:*

*ప్రతిపదార్థాలు*
 
*కరిణి*~ ఏనుగులుకలది; 
*యష్టిం*~ యజ్ఙదండముయొక్క స్వరూపమైనది;
*సువర్ణ*~ బంగారురంగుకలది లేక మంచి వర్ణములచే వ్యక్తమగునది;
వర్ణములు అనగా అక్షరములు మరియు రంగులు; మంచి అక్షరముల సముదాయముతో శుభమైన పద ప్రయోగముతో చేయు  సంభాషణలలో
లక్ష్మి ఉండును. సూర్యుని కాంతినుండీ ఏడు రంగులుధ్భవించును. కనుక
లక్ష్మి సువర్ణ స్వరూపిణి;
*హేమమాలిని* ~ బంగారు హారములుగలది;
*సూర్య* ~ సూర్యుని వెలుగు తన స్వరూపముగా కలది.

*తాత్పర్యము*

       ఏనుగులు సంపదను, లక్ష్మీ ప్రసన్నమును సూచించును కనుక,  అటునిటు
ఏనుగులతో లక్ష్మిని ధ్యానము  చేయవలెను. ఈ ధ్యానమునే గజలక్ష్మి అని
అందురు. యజ్ఞమున యజ్ఞశాలలోని స్థంభము పశువును బలి యిచ్చుటకు గుర్తు.  జీవుని పశుత్వమును బలియిచ్చి దివ్యత్వమును వర్ధిల్లజేయుట వలన
లక్ష్మీ కళ పెరుగును.

         సూర్య అనగా సూర్యుని ఆకారము, కాంతి, రంగులు, పేరులు తన
స్వరూపముగా గలది అని అర్థము. గుణమయి యగు ప్రకృతి అంతయూ
లక్ష్మీ స్వరూపము. అందుండు పురుషుడే అంతర్యామియై       
సౌరకుటుంబములోని లోకములన్నిటనూ వ్యాపించి యుండి నారాయణుడుగా తెలియబడు చున్నాడు. లక్ష్మి ఈ మంత్రమున నారాయణ సహితముగా ధ్యానము చేయబడి సాధకుని లోనికి ఆవహింపబడుచున్నది...

*శ్రీ సూక్తము ~ శ్లోకము 15:*

  *తాం మ ఆహవ జాతవేదో లక్ష్మీ మనపగామినీ*
   *యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాన్*
    *విందేయంపురుషానహమ్:*

*ప్రతిపదార్థాలు*

*జాతవేదాః* ~ ఓ జాతవేదుడా!  
*యస్యాం*~ఎవతెయందు;
*హిరణ్యం* ~ బంగారమును;  
*గావః* ~  గోవులను; 
*దాస్యః* ~దాసీజనమును;
*అశ్వాన్*~ అశ్వములను;  
*పురుషాన్*~ పురుషులను;
*అహం* ~ నేను;  
*విందేయం*~ పొందగలనో; 
*తాం*~ ఆమెను;
 *అనపగామినీమ్*~ ఎడబాయని లక్షణములు గల దానిని;
 *లక్ష్మీం*~ శుభ లక్షణ దేవతను;
*ఆవహః*~ ఆవహింపజేయుము;

*తాత్పర్యము*

           అపగమనము అనగా నెడబాయుట. ఆ లక్షణములు లేనిది
అనపగామిని. అభ్యాసమైన శుభలక్షణము ఎడబాయదు. సంపద దాని నెడబాయదు. హిరణ్యమనగా బంగారు రంగు వెలుగు. జీవ స్వరూపమైన సూర్యకిరణము. గోవు అనగా తెల్లనిరంగు కిరణములు. సూర్యుని ఈ కిరణములవలన. ఆనందమయ కోశము మేల్మొనును. దాసులనగా ఇంద్రియములు. ఇవి దాస్యము చేయుట యోగవిద్య. అశ్వమనగా ప్రాణమయ శరీరము. దీనివలన చైతన్యము, గమనము కలుగును. పురుషుడనగా జీవుడు. శ్రీసూక్త సిధ్ధి వలన సర్వజీవ మైత్రి
కలుగును. దా‌నితో సంపద కలుగును.

*శ్రీ సూక్తము ~ శ్లోకం ~ 16:* *(ఫలశృతి శ్లోకము:)*

          *యశ్శుచిః  ప్రయతో భూత్వా జుహుయా దాజ్య మన్వహం*
            *శ్రియః పంచదశర్చం చ శ్రీ కామః సతతం జపేత్:*

*ప్రతిపదార్థాలు*

 *యః*~ ఎవడు;  శ్రీకామః ~ సంపదకోరునో ( అతడు);
*శుచిః* ~ శుచికలవాడై;  
*ప్రయతః*~ ప్రయత్నముకలవాడై(శ్రధ్ధావంతుడై);
*అన్వహం* ~ అనుదినము; 
 *ఆజ్యం*~ నేతిని;
*జుహూయాత్*~  హోమము చేయవలెను;  చ ~ మరియు;
*శ్రియః*~ శ్రీదేవి యొక్క; 
*పంచదశ*~ పదునైదు;
*ఋచం* ~ ఋక్కుల సమూహమును;
*సతతం*~ ఎల్లప్పుడును; 
*జపేత్*~ జపించవలెను.

*తాత్పర్యము*

        శుచిమంతుడై,  ప్రయత్నము గలవాడై అనుదినమూ శ్రీసూక్తము యొక్క పదునైదు ఋక్కులను శ్రీకాముడైనవాడు నేతితో హోమము చేయుచూ జపించవలెను.

         శ్రీకాముడనగా సంపద కోరినవాడు. ఇది ఇహలోక పరలోక సంపద.
నేతిని హోమము చేయుట బహిర్యాగము. మధురమైన మైత్రీ భావమును
జపించుట అనగా, ఎల్లప్పుడునూ నిలుపుకొనుట అంతర్యాగము. శ్రీదేవి
అంతర్యాగముచే చక్కగా నారాధింప బడదగిన దనియూ, బహిర్యాగ
మునకు దుర్లభ రూపమున లభించుననియూ, శ్రీవిద్య యందు చెప్ప
బడినది. శుచిత్వ మనగా శరీరము, మనస్సు, ఇంద్రియములు శుచిగా
ఉండుట. ప్రయత్నము లేక శ్రధ్ధ యనగా నెల్లప్పుడునూ శ్రీదేవిని గుర్తుంచు
కొనుట, అనగా సర్వ జీవరాశులయందునూ దర్శించుట‌.
 
        *ఇది శ్రీసూక్తమునకు ఫల శృతి.*

Wednesday, September 2, 2020

పితృదేవతా స్తుతి

 పితృదేవతా స్తుతి


శ్రాద్ధాదులలో, మహాలయ పక్షాలలో దీనిని పఠించితే పితరుల కృప లభిస్తుంది. పితృదేవతా విజ్ఞానంతో కూడిన ఈ స్తుతి ఇంట్లో ఉంటే చాలు – పితృకృప చేత ఆ యిల్లు ఆనందైశ్వర్య నిలయమవుతుంది. పుష్టికారకమైన ఈ స్తుతి శ్రాద్ధంలో భోక్తల ముందు చదవడం కూడా శ్రేష్ఠం. ఇది ’గరుడ మహాపురాణం’లో చెప్పబడుతున్నది. ఇందులో అన్ని పితృగణాలు, వాటి విశేష రహస్యాలు చెప్పబడి ఉన్నాయి. దేవతల చేత కూడా ఆరాధింపబడే మహిమాన్వితులు పితృదేవతలు. వారి అనుగ్రహం వలన వంశవృద్ధి, ఐశ్వర్య క్షేమాలు సమకూరుతాయి.


నమస్యేహం పితౄన్ భక్త్యా యే వసన్త్యధిదైవతమ్!

దేవైరపి హి తర్ప్యన్తే యే శ్రాద్ధేషు స్వధోత్తరైః!!

నమస్యేహం పితౄన్ స్వర్గే యే తర్ప్యన్తే మహర్షిభిః!

శ్రాద్ధైర్మనోమయైర్భక్త్యా భుక్తిముక్తి మభీప్సుభిః!!

నమస్యేహం పితౄన్ సర్గే సిధాః సంతర్పయన్తియాన్!

శ్రాద్ధేషు దివ్యైః సకలైరుపహారైరనుత్తమైః!!

నమస్యేహం పితౄన్ భక్త్యా యోర్చ్యన్తే గుహ్యకైర్దివి!

తన్మయత్వేన వాంఛద్భి యుద్ధిమాత్యన్తికీం పరామ్!!

నమస్యేహం పితౄన్ మర్త్యై రర్చ్యన్తే భువియే సదా!

శ్రాద్ధేయు శ్రద్ధయాభీష్టలోక పుష్టి ప్రదాయినః!!

నమస్యేహం పితౄన్ యే వై తర్ప్యన్తేరణ్యవాసిభిః!

వన్యైః శ్రాద్ధైర్యతాహారైస్తపో నిర్ధూతకల్మషైః!!

నమస్యేహం పితౄన్ విప్రైర్నైష్ఠికైర్ధర్మచారిభిః!

యే సంయతాత్మభిర్నిత్యం సంతర్పన్తే సమాధిభిః!!

నమస్యేహం పితౄన్ శ్రాద్ధైః రాజన్యాస్తర్చయన్తియాన్!

కవ్యై రశేషైర్విధివల్లోకద్వయ ఫలప్రదమ్!!

నమస్యేహం పితౄన్ వైశ్యైరర్చ్యన్తే భువియే సదా!

స్వకర్మభి రతైర్నిత్యం పుష్పధూపాన్న వారిభిః!!

నమస్యేహం పితౄన్ శ్రాద్ధే శూద్రైరపి చ భక్తితః!

సంతర్ప్యన్తే జగత్కృత్స్నం నామ్నాఖ్యాతాః సుకాలినః!!

నమస్యేహం పితౄన్ శ్రాద్ధే పాతాళే యే మహాసురైః!

సంతర్ప్యన్తే సుధాహారా స్త్యక్త దర్పమదైః సదా!!

నమస్యేహం పితౄన్ శ్రాద్ధైః అర్చ్యన్తే యే రసాతలేః!

భోగైరశేషైర్విధివన్నాగైః కామానభీప్సుభిః!!

నమస్యేహం పితౄన్ శ్రాద్ధైః సర్పైః సంతర్పితాన్ సదా!

తత్రైవ విధివన్మహా భోగ సంపత్సమన్వితైః!!

పితౄన్నమస్యే నివసన్తి సాక్షాద్యే దేవలోకేధమహాతలేవా!

తధాన్తరిక్షేచ సురారి పూజ్యాస్తే వై ప్రతీచ్ఛన్తు మయోపధీతమ్!!

పితౄన్నమస్యే పరమార్థభూతా యే దై విమానే నివసన్త్యమూర్తాః!

యజన్తి యానన్తమలైర్మనోభి ర్యోగీశ్వరాః క్లేశవిముక్తి హేతూన్!!

పితౄన్నమస్యేదివి యే చ మూర్తాః స్వధాభుజః కామ్య ఫలాభినన్దౌ!

ప్రదానశక్తాః సకలేప్సితానాం విముక్తిదా యేనభిసంహితేషు!!

తృప్యన్తు తేస్మిన్పితరః సమస్తా ఇచ్ఛావతాం యే ప్రదిశన్తి కామాన్!

సురత్వమిన్ద్ర త్వ మితోధికం వా గజాశ్వరత్నాని మహాగృహాణి!!

సోమస్య యే రశ్మిషు యోర్కబింబే శుక్లౌ విమానే చ సదావసన్తి!

తృప్యన్తు తేస్మిన్పితరోన్నతోయైర్గన్ధాదినా పుష్టిమతో వ్రజన్తుః!!

యేషాం హుతేగ్నే హవిషాచ తృప్తిర్యే భుంజతే విప్రశరీరసంస్థాః!

యే పిండదానేన ముదం ప్రయాన్తి తృప్యన్తు తేస్మిన్పితరోన్నతోయైః!!

యే ఖడ్గ్మమాం సేన సురైరభీష్టైః కృష్ణైస్తిలైర్దివ్య మనోహరైశ్చ!

కాలేన శాకేన మహర్షివర్యైః సంప్రీణతాస్తే ముదమత్రయాస్తు!!

కన్యాన్య శేషాణి చ యాన్యభీష్టాన్యతీవ తేషాం మమ పూజితానాం!

తేషాం చ సాన్నిధ్య మిహాస్తు పుష్పగంధాంబు భ్యోజ్యేషు మయాకృతేషు!!

దినే దినే యే ప్రతిగృహ్ణతేర్చాం మాసాన్త పూజ్యా భువి యేష్టకాసు!

యే వత్సరాన్తేభ్యుదయే చ పూజ్యాః ప్రయాన్తు తేమే పితరోత్ర తుష్టిమ్!!

పూజ్యాద్విజానాం కుముదేన్దు భాసో యే క్షత్రియాణాం జ్వలనార్కవర్ణాః!|

తథా విశాం యే కనకావదాతా నీల ప్రభాః శూద్రజనస్య యేచ!!

తేస్మిన్సమస్తా మమ పుష్ప గంధధూపాంబు భోజ్యాది నివేదనేన!

తథాగ్ని హోమేన చయాన్తి తృప్తిం సదా పితృభ్యః ప్రణతోస్మి తేభ్యః!!

యే దేవ పూర్వాణ్యభితృప్తి హేతో రశ్నన్తి కవ్యాని శుభాహృతాని!

తృప్తాశ్చ యే భూతిసృజో భవన్తి తృప్యన్తు తేస్మిన్ ప్రణతోస్మి తేభ్యః!!

రక్షాంసి భూతాన్యసురాంస్తథోగ్రాన్ నిర్ణాశయన్తు త్వశివం ప్రజానామ్!

ఆద్యాః సురాణామమరేశ పుజ్యాస్తృప్యన్తు తేస్మిన్ ప్రణతోస్మితేభ్యః!!

అగ్నిష్వాత్తా బర్హిషద ఆజ్యపాః సోమపాస్తథా!

వ్రజన్తు తృప్తిం శ్రాద్ధేస్మిన్పితర స్తర్పితా మయా!!

అగ్నిష్వాత్తాః పితృగణాః ప్రాచీం రక్షన్తు మేదిశం!

తథా బర్హిషదః పాన్తు యామ్యాం మే పితరః సదా!!

ప్రతీచీ మాజ్యపాన్త ద్వదుదీచీమపి సోమపాః!

రక్షో భూతపిశాచే భ్యస్తథైవాసురదోషతః!!

సర్వతః పితరో రక్షాం కుర్వన్తు మమ నిత్యశః!

విశ్వో విశ్వ భుగారాధ్యో ధర్మో ధన్యః శుభాననః!!

భూతిదో భూతికృత్ భూతిః పితౄణాం యే గణానవ!!

కళ్యాణః కల్యదః కర్తా కల్యః కల్యతరాశ్రయః!

కల్యతా హేతురనఘః షడిమే తే గణాః స్మృతాః!!

వరో వరేణ్యో వరదస్తుష్టిదః పుష్టిదస్తథా!

విశ్వపాతా తథా ధాతా సప్తైతే చగణాః స్మృతాః!!

మహాన్మహాత్మా మహితో మహిమావాన్మహాబలః!

గణాః పంచ తథైవైతే పితౄణాం పాపనాశనాః!!

సుఖదో ధనదశ్చాన్యే ధర్మదోన్యశ్చ భూతిదః!

పితౄణాం కథ్యతే చైవ తథా గణ చతుష్టయమ్!!

ఏకత్రింశత్పితృగణా యేర్వ్యాప్త మఖిలం జగత్!

త ఏవాత్ర పితృగణాస్తుష్యన్తు చ మదాహితాత్!!

మార్కండేయ ఉవాచ

ఏవంతు స్తువతస్తస్య తేజసో రాశిర్రుచ్ఛ్రి తః!

ప్రాదుర్బభూవ సహసా గగనవ్యాప్తి కారకః!!

తద్ దృష్ట్వా సుమహత్తేజః సమాచ్ఛాద్య స్థితం జగత్!

జానుభ్యామవనీం గత్వా రుచిః స్తోత్రమిదం జగౌ!!

రుచిరువాచ

అర్చితానామమూర్తానాం పితౄణాం దీప్త తేజసామ్!

నమస్యామి సదా తేషాం ధ్యానినాం దివ్య చక్షుషామ్!!

ఇంద్రాదీనాం చ నేతారో దక్షమారీచ యోస్తథా!

సప్తర్షీణాం తథాన్యేషాం తాన్నమస్యామి కామదాన్!!

మన్వాదీనాం చ నేతారః సూర్యాచన్ద్ర మసోస్తధా!

తాన్నమస్యామ్యహం సర్వాన్ పితౄణప్యుదధావపి!!

నక్షత్రాణాం గ్రహాణాం చ వాయ్వగ్న్యోర్నభసస్తథా!

ద్యావాపృథివ్యోశ్చ తథా నమస్యామి కృతాంజలిః!!

ప్రజాపతేః కశ్యపాయ సోమాయ వరుణాయ చ!

యోగేశ్వరేభ్యశ్చ సదా నమస్యామి కృతాంజలిః!!

నమో గణేభ్యః సప్తభ్య స్తథాలోకేషు సప్తషు!

స్వాయంభువే నమస్యామి బ్రహ్మణే యోగ చక్షుషే!!

సోమాధారాన్ పితృగణాన్ యోగిమూర్తిధరాం స్తథా!

నమస్యామి తధా సోమం పితరం జగతా మహమ్!!

అగ్నిరూపాం స్తథైవాన్యాన్నమస్యామి పితౄనహమ్!

అగ్నీషోమమయం విశ్వం యత ఏతదశేషతః!!

యే చ తేజసి యే చైతే సోమసూర్యాగ్ని మూర్తయః!

జగత్స్వరూపిణశ్చైవ తథా బ్రహ్మ స్వరూపిణః!!


తేభ్యోఖిలేభ్యో యోగిభ్యః పితృభ్యో యతమానసః!

నమో నమో నమస్తేస్తు ప్రసీదస్తు స్వధాభుజః!!

మార్కండేయ వువాచ

ఏవం స్తుతాస్తతస్తేన తేజసోమునిసత్తమాః!

నిశ్చక్రముస్తే పితరో భాసయన్తో దిశోదిశ!!

నివేదనం చ యత్తేన పుష్పగంధానులేపనం!

తద్భూషితానథ స తాన్ దదృశే పురతః స్థితాన్!!

ప్రణిపత్య రుచిర్భక్త్యా పునరేవ కృతాంజలిః!

నమస్తుభ్యం నమస్తుభ్యమిత్యాహ పృధగాద్రుతః!!

స్తోత్రేణానేనచ నరో యోస్మాం స్తోష్యతి భక్తితః!

తస్య తుష్టావయం భోగానాత్మజం ధ్యానముత్తమమ్!!

ఆయురారోగ్యమర్ధం చ పుత్ర పౌత్రాదికం తధా!

వాంఛద్భిః సతతం స్తవ్యాః స్తోత్రేణానేన వైయతః!!

శ్రాద్ధేషు య ఇమం భక్త్యా త్వస్మత్ప్రీతి కరం స్తవమ్!

పఠిష్యతి ద్విజాన్మానాం భుంజతాం పురతః స్థితః!!

స్తోత్ర శ్రవణ సంప్రీత్యా సన్నిధానే పరే కృతే!

అస్మాభిరక్షయం శ్రాద్ధం తద్భవిష్యత్యసంశయమ్!!

యస్మిన్ గేహే లిఖిత మేతత్తిష్ఠతి నిత్యదా!

సన్నిధానం కృత్యౌ శ్రాద్ధౌత త్రాస్మాకం భవిష్యతి!!

తస్మాదేతత్త్వ యా శ్రాద్ధే విప్రాణాం భుంజతాం పురః!

శ్రవణీయం మహాభాగ అస్మాకం పుష్టికారకమ్!!


(రుచి ప్రజాపతి చేసిన ఈ స్తోత్రం నిత్యం పఠించవచ్చు)

Thursday, July 30, 2020

వరలక్ష్మీ వ్రత కల్పంపూజ విధానము

వరలక్ష్మీ వ్రత కల్పం పూజ విధానము:

ఆచమనం : (పై మూడు మంత్రములతో పంచపాత్రలోని నీటిని ఉద్ధరిణితో చేతిలో పోసుకొని తీసుకోవాలి)
ఓం కేశవాయ స్వాహా
ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా
గోవిందాయ నమః
విష్ణవే నమః
మధుసూదనాయ నమః
త్రివిక్రమాయ నమః
వామనాయ నమః
శ్రీధరాయ నమః
హృషికేశాయ నమః
పద్మనాభాయ నమః
దామోదరాయ నమః
సంకర్షణాయ నమః
వాసుదేవాయ నమః
ప్రద్యుమ్నాయ నమః
అనిరుద్ధాయ నమః
పురుషోత్తమాయ నమః
అధోక్షజాయ నమః
నారసింహాయ నమః
అచ్యుతాయ నమః
జనార్ధనాయ నమః
ఉపేంద్రాయ నమః
హరయే నమః
శ్రీకృష్ణాయ నమః
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
(అని పై నామములను స్మరింపవలెను)

శ్లో|| ఉత్తిష్ఠంతుభూతపిశాచాః ఏతే భూమిభారకాః |
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||
పై శ్లోకము చదివి అక్షతలు వాసన చూచి తమ ఎడమవైపున వేసుకొనవలయును.
ఆ తరువాత కుడిచేతితో ముక్కు పట్టుకొని ఈ క్రింది విధముగా ప్రాణాయామము చేయవలయును.

ప్రాణాయామము :
ఓం భూః, ఓంభువ, ఓగ్ం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్ం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్, ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం ||
పై మంత్రముతో 3 మార్లు ప్రాణాయామము చేసి సంకల్పం చేయాలి.

సంకల్పం :
ఓం మమ ఉపాత్తదురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శొభనే ముహూర్తే అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే అస్మిన్(ఆయా ప్రంతాలకు మార్చుకోవాలి) వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరానాం మధ్యే శ్రీ .......(సంవత్సరం పేరు చెప్పాలి) నామసంవత్సరే, దక్షిణాయనే, వర్ష ఋతౌ, శ్రావణమాసే, ....పక్షే , ....తిధౌ, శుక్రవాసర యుక్తాయాం, శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభతిదౌ, శ్రీమత్యాః .....(పేరు చెప్పాలి), గోత్రః .........(గోత్రం పేరు చెప్పాలి) నామధేయస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, విజయ ఆయురారొగ్య ఐశ్వర్యాభివ్రుధ్యర్ధం, ధర్మార్ధ కామమోక్ష చతుర్విద ఫలపురుషార్ధ సిద్ధ్యర్ధం, ప్రారబ్ధదోష నివృత్తి ద్వారా శ్రీ వరలక్ష్మీ ప్రసాదేన అష్టైశ్వర్యయుత శ్రీమహాలక్ష్మీ ప్రాప్తర్థ్యర్థం, మనోవాంచా పరిపూర్తర్థం శ్రీ వరలక్ష్మీవ్రతం కరిష్యే

అదౌనిర్విగ్నేన పరిసమాప్త్యర్థం శ్రీమహా గణపతి స్మరణ పూర్వక పంచోపచార పూర్వక కరిష్యే 
తదంగ కలశారాధనం కరిష్యే.

(కలశమునకు గంధపు బొట్లు పెట్టి అక్షితలద్ది లోపల ఒకపుష్పమునుంచి ఆ పాత్రపై కుడి చేతితో మూసి ఈ క్రింది మంత్రమును చేప్పుకోవాలి )

కలశస్య ముఖే విష్ణు: కంఠే రుద్ర స్సమాశ్రిత:| 
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాత్రు గణా: స్మృతా:||
కుక్షౌతు సాగరా: సరేసప్త దీపా వసుంధరా| 
ఋగ్వేదొ విధ యజుర్వేద: సామవేదొ హ్యధర్వణ:||
అంగైశ్చ సహితా: సర్వే కలశాంబు సమాశ్రితా:| 
ఆయంతు దేవ పూజార్థం దురితక్షయ కారకా:||
గ్లాసులో నీళ్ళు అమ్మవారిమీద పూజద్రవ్యాల మీద చల్లండి

గంగేచ యమునే చైవ గొదావరి సరస్వతి| 
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు|| 
కలశొదకేన పూజా ద్రవ్యాణి దేవమండపఆత్మానంచ సంప్రొక్ష్య
(కలశములొని నీటిని పూజ ద్రవ్యములపైన మన పైన చల్లుకోవాలి)
ఇప్పుడు పసుపుతో వినాయకుడిని చేసుకోని కింది శ్లోకాన్ని చెప్పుకోవాలి

శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే||
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
ధూమకేతు ర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కంద పూరజః
షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయా దపి
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గయే తథా
సఙ్గ్రమే సర్వ కార్యేషు విఘ్నస్తస్య నజాయతే
అభీప్సితార్థసిద్ధ్యర్థం పూజితో యస్సురైరపి
సర్వవిఘ్నచ్చిదే తస్మైగణాధి పతయే నమః ||

పూజ ప్రారంభము:

పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
నారాయణప్రియే దేవి సుప్రీతాభవ సర్వదా
క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే
సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే ||
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ||
అక్షింతలు వేయాలి

సర్వమంగళ మాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి
దేవి! త్వాం సుప్రీతా భవ సర్వదా ||
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః || ధ్యాయామి || ఆవాహయామి
అక్షింతలు వేసి ఆచమనీయం చేయాలి

సూర్యాయుత నిభస్పూర్తే స్ఫురద్రత్న విభూషితం
సింహాసన మిదం దేవి స్థీయతాం సురపూజితే
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః ధ్యాయామి
రత్నసింహాసనం సమర్పయామి
అక్షింతలు చల్లాలి

శుద్ధోదకం చ పాత్రస్థం గంధ పుష్పాది మిశ్రితం
అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణ సురపూజితే
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః అర్ఘ్యం సమర్పయామి
నీళ్ళు వదలాలి

సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం
పాద్యం గృహాణ దేవి త్వం సర్వదేవ నమస్కృతే
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః పాద్యం సమర్పయామి
అమ్మవారిపై నీళ్ళు చల్లాలి

సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతం
గృహాణాచమనం దేవి మయాదత్తం శుభప్రదే
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః ఆచమనీయం సమర్పయామి
నీళ్ళు చల్లాలి

పయోదధి ఘృతోపేతం శర్కరా మధుసంయుతం
పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః పంచామృత స్నానం సమర్పయామి
పంచామృతం చల్లాలి

గంగాజలం మయానీతం మహాదేవ శిరస్స్థితం
శుద్ధోదక స్నాన మిదం గృహాణ విధు సోదరి
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి
నీళ్ళు చల్లాలి

సురార్చితాంఘ్రి యుగళే దుకూల వసనప్రియే
వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః వస్త్రయుగ్మం సమర్పయామి
వస్త్రం సమర్పించాలి

కేయూర కంకణే దివ్యేహారనూపుర మేఖలా
విభూషణాన్యమూల్యాని గృహాణ ఋషి పూజితే
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః ఆభరణాని సమర్పయామి
ఆభరణాలు అమ్మవారికి పెట్టాలి

తప్త హేమకృతం దేవి మాంగల్యం మంగళప్రదం
మయా సమర్పితం దేవి గృహాణ త్వం శుభప్రదే
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః మాంగల్యం సమర్పయామి
అమ్మవారికి మాంగల్యం సమర్పించాలి

కర్పూరాగరు కస్తూరి రోచనాదిభి రన్వితం
గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతి గృహ్యాతాం
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః గంధం సమర్పయామి
గంధం, కుంకుమ పెట్టాలి

అక్షతాన్ ధవళాన్ దేవి శాలీయాన్ తుండులాన్ శుభాన్
హరిద్రా కుంకుమో పేతాన్ గృహ్యతామబ్ధిపుత్రికే
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః అక్షతాన్ సమర్పయామి
అక్షింతలు, పసుపు, కుంకుమ చల్లాలి

మల్లికా జాజికుసుమైశ్చంప కైరపిర్వకుళైస్తతహా
శతపత్రైశ్చ కల్హారైః పూజయామి హరిప్రియే
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః పుష్పాణి పూజయామి
అమ్మవారిని పూవులతో అలంకరించాలి

అథాంగ పూజ:
చంచలాయై నమః పాదౌ పూజయామి
చపలాయై నమః జానునీ పూజయామి
పీతాంబర ధరాయై నమః ఊరూ పూజయామి
కమల వాసిన్యై నమః కటిం పూజయామి
పద్మాలయాయై నమః నాభిం పూజయామి
మదన మాత్రే నమః స్తనౌ పూజయామి
లలితాయై నమః భుజద్వయం పూజయామి
కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి
సుముఖాయై నమః ముఖం పూజయామి
శ్రియై నమః ఓష్ఠౌ పూజయామి
సునేత్రాయై నమః నేత్రౌ పూజయామి
రమాయై నమః కర్ణౌ పూజయామి
కమలాయై నమః శిరః పూజయామి
వరలక్ష్మ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి

శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ పూజ చేయాలి. (ఒక్కొక్క నామానికి పూలు/పసుపు/కుంకుమ వేయాలి)

దశాంగం గుగ్గులోపేతం సుగధం చ మనోహరం
ధూపం దాస్యామి తే దేవి వరలక్ష్మీ గృహాణత్వం
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః ధూపం సమర్పయామి
అగరవత్తులు వెలిగించండి

ఘృతాక్తవర్తి సంయుక్త మంధకార వినాశకం
దీపం దాస్యామి తే దేవి గృహాణముదితా భవ
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః దీపం దర్శయామి
దీపం వెలిగించండి

నైవేద్యం షడ్రసోపేతం దధిమధ్వాజ్య సంయుతం
నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః నైవేద్యం సమర్పయామి
పిండి వంటలపై నీళ్ళు చల్లాలి

ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం
పానీయం గృహ్యాతాం దేవి శీతలం సుమనోహరం
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః పానీయం సమర్పయామి
నీళ్ళు చల్లలి

ఊగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం
కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః తాంబూలం సమర్పయామి
తాంబూలం వక్కలతో పెట్టండి

నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం
తుభ్యం దాస్యామ్యహం దేవి గ్ర్హ్యాతాం విష్ణువల్లభే
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః నీరాజనం సమర్పయామి
కర్పూరం వెలిగించాలి

పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
నారాయణ ప్రియే దేవి సుప్రీతాభవ సర్వదా
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః మంత్రపుష్పం సమర్పయామి
చేతిలో పూలు అక్షితలు తీసుకుని ప్రదక్షిణ చేయాలి

యానికాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవా
త్రాహి మాం కృపయాదేవి శరణాగతవత్సలే
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్కారుణ్యభావేన రక్ష రక్ష జనార్థన
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః ప్రదక్షిణం సమర్పయామి

నమస్తే లోక జనని నమస్తే విష్ణువల్లభే
పాహిమాం భక్త వరదే వరలక్ష్మ్యై నమో నమః
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నమస్కారాన్ సమర్పయామి

తోరగ్రంధి పూజ:
తోరాన్ని అమ్మవారి ముందుంచి ఒక్కొక్క ముడికి ఇల పూజ చేయాలి
కమలాయై నమః ప్రథమ గ్రంధిం పూజయామి
రమాయై నమః ద్వితీయ గ్రంధిం పూజయామి
లోకమాత్రే నమః తృతీయ గ్రంధిం పూజయామి
విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంధిం పూజయామి
మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంధిం పూజయామి
క్షీరాబ్దితనయాయై నమః షష్ఠ గ్రంధిం పూజయామి
విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంధిం పూజయామి
చంద్రసహోదర్యై నమః అష్టమ గ్రంధిం పూజయామి
హరివల్లభాయై నమః నవమ గ్రంధిం పూజయామి
తోరము కడుతూ కింది శ్లోకం చదవాలి

తోరబంధన మంత్రం:
బధ్నామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం
పుత్ర పౌత్రాభి వృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే

వాయన విధి:
ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం శ్వశక్తితః
దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హి ద్విజాతయే
ముత్తయిదువకు పండ్లు, పూలూ, తాంబూలం శక్తి కొలది వాయనం ఇవ్వచ్చు. వాయనం ఇచ్చేటప్పుడు ఈ క్రింది మంత్రం చదవాలి.

వాయనదాన మంత్రం:
ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరాయై దదాతి చ
ఇందిరాతారకోభాభ్యాం ఇందిరాయై నమో నమః
ఇతి పూజా విధానం సంపూర్ణం.

వరలక్ష్మీ వ్రత కథ:

(అక్షింతలు చేతిలో వేసుకొని, కథను భక్తి శ్రద్దలతో వినాలి)

రమ్యమైన కైలాస పర్వతంలో ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు వినోదముగ పాచికలాడు చుండిరి. పార్వతి గెలిచినది. పరమ శివుడు పరాజితుడైనాదు. నేను గెలిచినంటే నేను గెలిచానన్న వివాదము వారిద్దరి మధ్య తలయెత్తెను. సమీపమందున్న చిత్రనేమినడుగగా ఆతడు శివునిదే జయమనెను. కోపితురాలై గౌరి అసత్యమాడిన చిత్రనేమిని కుష్ఠురోగివై భూలోకమున సరోవరతీరంలో పడిపొమ్మని శపించెను. క్షమింపుమని వేడి శాపావసానము నడిగెను. ప్రసన్నురాలైన పార్వతి, యే దినమున అప్సరకాంతలు ఆ అసరోవరతీరంలో వరలక్ష్మీ వ్రతము చేయుదురో ఆ దినమున నీవా వ్రతమును చూచి శాపవిముక్తిని పొందెదవనెను. అదే విధముగ చిత్రనేమి శాపవిముక్తుడై కైలాసము చేరుకొనెను.

మఱియు మగధదేశమున పూర్వము కుండిన మనునగరముండెను. అందు చారుమతి అనునొక బ్రాహ్మణ స్త్రీ నివసించుచుండెను. ఆమె తన భర్తనే దైవముగ తలచి సేవించుచుండెను. త్రికరణ శుద్దిగల ఆ పతివ్రతామతాల్లిపై అనుగ్రహభావము గల్గి మహాలక్ష్మి ఒకనాటి రాత్రి స్వప్నమున సాక్షాత్కరించి "నేను వరలక్ష్మీదేవిని  శ్రావణశుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారమునాడు నీవు వరలక్ష్మీ వ్రతమును చేయుమని, ఆ వ్రతవిధానమును చెప్పి నీకు సర్వవిధ సౌభాగ్యములు కలుగుగాక" అని ఆశీర్వదించుచు అంతర్ధానమయ్యెను. చారుమతి మేల్కుని సంతోషముతో తనకు కల్గిన స్వప్నమును పెద్దలందరికి చెప్పు శ్రావణ యెదుర్శుక్రవారము కొఱకై యెదురుచూచుచుండెను. శ్రావణ పూర్ణిమకు ముందున్న శుక్రవారము రాగా చారుమతి మున్నగు స్త్రీలందరు కలుసుకొని మిక్కిలి భక్తితో స్నానాదులు ముగించుకొని ఇంటిని గోమయముతో సుద్దిచేసి మంటపము నేర్పరచి, రంగవల్లులతో అలంకరించి

పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే |
నారాయణ ప్రియేదేవి సుప్రీతాభవసర్వదా ||

అను శ్లోకముచే ధ్యానావాహనాదిషోడశోపచార పూజలు చేసి నవసూత్ర తోరము కట్టుకొని భక్తితో వరలక్ష్మికి ప్రదక్షిణము చేసిరి. మొదటి ప్రదక్షిణము చేయగానే ఘల్లుఘల్లుమను శబ్దము వచ్చెను. అందరి కాళ్లకు గజ్జెలు కట్టబడియుండెను. అంతయు వరలక్ష్మి కటాక్షమని తలంచి రెండవ ప్రదక్షిణము చేసిరి. తమ అము చేసిరి. స్త్రీలు అందరూ సర్వాభరణ భూషితలైరి. చారుమతి మొదలగు స్త్రీల గృహములన్నియు స్వర్ణమయములై రథగజతురగవాహనములతో నిండిపోయెను. చారుమతి మొదలగు స్త్రీలందరు బ్రాహ్మణులకు వాయనములిచ్చిరి. ఆశీర్వాదము తీసుకొని ప్రతి సంవత్సరము అందరు అత్యంత శ్రద్ధాభక్తులతో వరలక్ష్మీ వ్రతము నాచరించుచు సర్వవిధ సౌభాగ్యములు బొంది సుఖించిరి. ఈ వ్రతమును పరమేశ్వరుడు పార్వతికి ఉపదేశించెను. వరలక్ష్మీ వ్రతము సర్వ సంపత్కరమే కాక సర్వకార్యసిద్దిని కలుగజేయును.
(అక్షింతలు అమ్మవారిపై వేసి అందరి మీద వేసుకొని ప్రసాదం స్వీకరించాలి.

ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః
వెంకటేశ్వరశర్మ మహంకాళి

Friday, April 10, 2020

Life History of Sri Tadepalli Raghava Narayana Sastry Garu, popularly called as Chandolu Sastry Garu.

🌺 చందోలు మహర్షులుగా ప్రసిద్ధి గాంచిన బ్రహ్మీభూతులు శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిగారి సమగ్ర జీవిత విశేషాలు🌺

బాలా త్రిపుర సుందరి అమ్మ వారి స్వరూపం


చందవోలు గ్రామంలో తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి, హనుమమ్మ దంపతులకు రాఘవనారాయణ శాస్త్రి గారు జన్మించారు. తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి గారు 1922లో శ్రీ కాకాని మల్లీశ్వర మాహాత్యము ప్రబంధాన్ని వ్రాసి ప్రచురించారు. తిరిగి 1986లో తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు  రామకథామృత గ్రంథమాల తరఫున పునర్ముద్రించారు

విద్యాభ్యాసం

రాఘవ నారాయణశాస్త్రికి ఎనిమిది సంవత్సరాల వయసు రాగానే తండ్రి వెంకటప్పయ్యశాస్త్రి ఉపనయనం చేశారు  వెంకటప్పయ్యశాస్త్రి వద్దనే రాఘవనారాయణశాస్త్రి సంస్కృతాంధ్ర సాహిత్యాలు చదువుకోవడం ప్రారంభించారు. విద్యాభ్యాసాన్ని తీవ్రమైన ఏకాగ్రత, నిష్టతో చేయడం ప్రారంభించారు. విద్యాభ్యాస కాలం నుంచే త్రికాల సంధ్యావందనం, అగ్నికార్యం సకాలంలో చేయడం ప్రారంబించి, సంప్రదాయానుసారం, శాస్త్రానుసారం వచ్చిన విధులన్నీ పాటించేవారు. అయితే వీరిచేత అక్షరాభ్యాసం చేయించి, లౌకిక విద్య  తాడికొండ గ్రామస్తులైన కేదారలింగం నేర్పడం ప్రారంభించారు. ఆయన బాలాత్రిపురసుందరీ ఉపాసకులు. 12వ సంవత్సరంలోనే రాఘవనారాయణశాస్త్రికి వెంకటప్పయ్యశాస్త్రి అనుమతితో కేదారలింగం "బాలా త్రిపుర సుందరి మంత్రాన్ని" ఇచ్చారు. బాల ఉపాసన 16 సంవత్సరాల వయసుకే పండి జీవితాంతం అమ్మవారు పిలిస్తే పలికే దైవంగా నిలిచింది. దెందుకూరి పానకాల శాస్త్రి వద్ద తర్కం, పొదిలి సీతారామశాస్త్రి వద్ద మంత్రానుష్ఠానం నేర్చారు.

సన్యసించేందుకు ప్రయత్నాలు, వివాహం

రాఘవనారాయణశాస్త్రికి యవ్వనంలోనే సన్యసించాలనే కోరిక కలిగింది. సన్యసించేందుకు తల్లి అనుమతి తప్పనిసరి కాగా ఆమె రాఘవనారాయణశాస్త్రి సన్యసించేందుకు అనుమతినివ్వలేదు. కుమారుడు సన్యసించడాన్ని వెంకటప్పయ్యశాస్త్రి కూడా వ్యతిరేకించారు. అయితే కొన్నాళ్ళకు వెంకటప్పయ్యశాస్త్రికి కుమారుడు కనిపించక వెతుకుతూండగా ఊరి చివర పొదలమాటున నిర్వికల్ప సమాధిలో తపస్సు చేసుకుంటున్న రాఘవనారాయణశాస్త్రి కనిపించారు. తన కొడుకు వైరాగ్యం ఏ స్థాయిలో ఉందో తెలిసివచ్చింది. శ్యామలాంబ అనే యోగిని వీరి తండ్రి గారితో శాస్త్రి గారు సూర్య మండలాన్తర్వర్తి అయిన మహా సిద్ధుడు ఈ రూపంలో జన్మించాడని చెప్పింది. శాస్త్రి గారికి చిన్నతనంలో పిన తల్లి చూపించిన ఒక దృశ్యం గోచరించింది. అందులో తాను ఒక సిద్ధుడు శ్రీ చక్రేశ్వారి అయిన కామేశ్వరి దూరంగా ఉన్న యువతుల్ని తీసుకు రమ్మన్నది. ఒకరిని మోసుకొని ఇద్దర్నీ తీసుకొచ్చాడు. అమ్మవారు చిరునవ్వుతో అతని మనసు కొంచెం చలించింది అని భూలోకంలో జన్మించమని తాను మోసుకొచ్చిన అమ్మాయే భార్య అవుతుందని అన్నది. 19 వ ఏట అద్దేపల్లి మంగమ్మ, పాపయ్య శాస్త్రుల కూతురు పార్వతితో వివాహ మైంది. పిన్ని చూపించింది కూడా ఈమెనే. ఆమె పేరును శ్రీదేవిగా శాస్త్రిగారు మార్చారు.

పాండిత్యం
శాస్త్రి గారు తండ్రి గారి వేద పాఠశాల నిర్వహణలో తోడు పడుతూ ఉన్నారు. ఆయన పద్ధతి నచ్చిన చాలా మంది అమెరికాకు రమ్మన్నారు. వారికి ఇష్టం లేదు. పిన పాటి వీరభద్రయ్యతో నేత్రావధానం, ఎలేశ్వరపు పురుషోత్తమ శాస్త్రితో కవిత్వ సాధన చేశారు. అప్పటికే అనేక సభల వారు శాస్త్రి గారికి 400 కు పైగా సర్టి ఫికేట్స్ ఇచ్చారు. వ్యాకరణ గురువు గారు ముదిగొండ నాగలింగ శాస్త్రి గారితో అనేక అవధానాలు చేసి, ఆ డబ్బు అంతా గురువు గారికే సమర్పించారు. పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ చంద్ర శేఖర భారతీ స్వామి సన్నిధిలో జరిగిన అష్టావదానికి వారు మెచ్చి ఉభయ శ్లేషకు లక్ష్యంగా ఒక శ్లోకం చెప్ప మంటే ఆశువుగా అద్భుతంగా చెప్పి ఒప్పించారు.

అమ్మ వారి సాక్షాత్కారం
దేశ సంచారం చేస్తూ ఒక సారి ఇంటికి వస్తే ఇల్లు ‘’అయ్యవారి నట్టిల్లు ‘’లా ఉంది. ఇంటి వద్దే ఉండి తండ్రికి తోడ్పడ్డారు. తిండికి గడవని పరిస్థితి. మూడు రోజులు అంతా ఉపవాసమే. మూడవ రోజు రాత్రి 27 సార్లు లలితా సహస్ర నామ పూజ చేసి నైవేద్యం పెట్టిన జలాన్నే త్రాగి అన్గోస్త్రం నేల మీద పరచి నిద్ర పోయారు. 10 ఏళ్ళ బాలిక కలలో కన్పించి ‘’ఒర్ ! ముష్టి పెడతాను. కొంగు పట్టు ‘’అన్నది. దోసెడు బియ్యం కొంగు లో పోసి ‘’బండి వస్తుంది. అందులో కావలసిన సామగ్రి అంతా వస్తుంది ‘’అన్నది. తెల్లారే సరికి ఖాజీ పాలెం సీతా రామ రాజుగారి బండి వచ్చింది. అక్కడ రాజు గారు కోరిన మీదట పురాణం చెప్పి రాత్రి ఇంటికి వచ్చే సరికి తలుపు దగ్గర రాజు గారు పోయించిన పుట్టెడు ధాన్యపు రాశి కన్పించింది. అప్పటి నుంచి శాస్త్రి గారింట లక్ష్మీ దేవి నిత్య సాక్షాత్కారమే.
అనేక గ్రామాలలో భాగవతం, హరి వంశం, పురాణం చెబుతూ రాత్రికి ఇంటికి చేరేవారు. పరమ నిష్టాగరిష్టంగా జీవించేవారు. ప్రాణాయామం తపస్సు కొనసాగించారు. ఇంట్లో వేరుసెనగ నూనె, వేరుసెనగ వాడలేదు. దొండకాయ, టమేటా, బంగాళా దుంప, ముల్లంగి కాబేజీ నిషిద్ధం. కాశీకి తప్ప ఎప్పుడూ రైలు ప్రయాణం చేయలేదు. ఆయనకు మగ సంతానం లేదు. కూతురు లక్ష్మిని చెరువు సత్య నారాయణ శాస్త్రి కిచ్చి వివాహం చేశారు. ఆయనే శాస్త్రి గారి జీవిత చరిత్ర రాశారు.

అష్ట సిద్దులు కైవసం
శాస్త్రి గారికి అష్ట సిద్ధులు వశమైనాయి. వాటిని స్వంతానికి ఎప్పుడూ వాడుకోలేదు. వారు చాలా గొప్ప తపశ్శక్తి సంపన్నులు. ఆ తపస్సు ఈ ఒక్క జన్మలోనిది కాదు. ఎన్నెన్నో జన్మలలో చేసిన తపస్సంతా కలిసి ఆయన ఆ స్థితిలో ఉండేవారు. దేవతా శక్తులన్నీ వారి చుట్టూ ఎప్పుడూ తిరుగుతూ ఉండేవి. అన్ని దైవ శక్తులు ఎల్లప్పుడూ వారి అధీనంలో ఉండేవి. కానీ వారెన్నడూ వాటిని తన స్వార్థానికి వినియోగించుకోలేదు. అమ్మవారు వారిని అనేక సార్లు "నీకు ఏమి కావాలో చెప్పు. ఐశ్వర్యం, చక్రవర్తిత్వం, దాసదాసీలు, ఏనుగులు, సంపదలు, కీర్తి ఏమి కావాలన్నా ప్రసాదిస్తాను కోరుకో" అనేది. వారు "నువ్వే నాతో ఉన్నప్పుడు అవన్నీ నాకెందుకమ్మా" అనేవారు. పూర్తి నిష్కామంగా జీవితమంతా గడిపారు వారు ఆయుర్వేద వైద్యం చేసేవారు. దాని అధ్యయనంలో భాగంగా వారికి ’వశ్యంకర ఔషధి ‘’ని ఒక మూలిక గురించి తెలిసింది. అది కేవలం గ్రహణ సమయంలో మాత్రమే కంటికి కనిపించే మూలిక. అది కూడా ఒక నిర్ణీత స్థలంలో మాత్రమే లభ్యమవుతుంది. ఈ విషయం తెలుసుకున్న శాస్త్రి గారు అది దగ్గరలోని ఒక కొండ మీద లభిస్తుందని తెలుసుకుని ఒక గ్రహణ సమయానికి ఆ కొండ మీదకి వెళ్ళారు. సరిగ్గా గ్రహణం ఆరంభం కాగానే ఆ మూలిక వారికి కనిపించింది. పరమానందంతో వారు దానిని సమీపించి కోసుకోబోతుండగా అక్కడ ఒక చిన్న పిల్లవాడు అడ్డు వచ్చాడు. సరేలే అని వారు వేరే వైపు నుంచి వచ్చి దానిని కోసుకుందామనుకుంటే ఆ పిల్లవాడు ఆ వైపు కూడా అడ్డు వచ్చాడు. అలా ఏ వైపు చూస్తే ఆ వైపు ఆ పిల్లవాడు అడ్డు వస్తుండడంతో వారికి ఆ మూలిక కోసుకోవడం కుదరడం లేదు. ఇక విసిగిపోయిన వారు "ఎవడవురా నువ్వు? నాకెందుకు అడ్డు వస్తున్నావు? నన్ను ఆ మూలిక కోసుకోనీ. మరల గ్రహణం అయిపోతే అది కనిపించదు" అన్నారట. ఆ పిల్లవాడు "నేనెవరైతే నీకెందుకు? నీకు ఆ మూలిక ఎందుకు?" అని ప్రశ్నించాడు. "ఆ మూలిక మన దగ్గర ఉంటే మనకు విశ్వమంతా వశమవుతుందట. కనుక నన్ను దానిని తీసుకోనీ" అని శాస్త్రి గారన్నారు. దానికి అ పిల్లవాడు నవ్వి "‘’నీకు ఈ మొక్క తో పని లేదు. నీ ముఖం చూస్తేనే అందరు వశు లౌతారు ‘’ఆ మూలిక లేకుండానే నీకు విశ్వం వశమైందిగా" అన్నాడట. శాస్త్రి గారు "అదంతా నీకెందుకు? ముందు అడ్డు తొలగు. మరల గ్రహణం అయిపోతే నాకు అవకాశం చేజారిపోతుంది" అని కోరారు. కానీ పిల్లవాడు ఒప్పుకోలేదు. ఈ లోగా గ్రహణం పూర్తయిపోయింది, ఆ మూలిక మాయమైపోయింది. బాలుడు మాయమయ్యాడు శాస్త్రి గారు తనకు దాన్ని పొందే యోగం లేదని నిట్టూరుస్తూ ఉండగా ఆ పిల్లవాడు మూడు ముఖాలతో దత్తాత్రేయ స్వామిగా దర్శనమిచ్చాడు. కారణం ఆ మూలికకు అధిదేవత దత్తాత్రేయస్వామి.. వీరు వేరే గ్రామంలో అధ్యయనం నిమిత్తం కొన్ని రోజులు ఉన్నప్పుడు ఒక సారి ఒక 6-7 యేళ్ళ పిల్లవాడు వీరిని చూచి "మనిద్దరం కలిసి ఫలానా కొండ మీద 20 సంవత్సరాలు తపస్సు చేసుకున్నాం కదా! గుర్తు లేదా?" అని అడిగాడట. వీరికేమీ అర్థం కాక ఏ కొండ మీద, ఎప్పుడు, ఎవరు అని ఏదో అడుగబోతుండగా ఆ పిల్లవాడు పారిపోయాడట. అంటే వాడు ఏ జన్మలో వారి తపస్సాహచర్యం పొందిన మహా భాగ్యశాలియో కదా! పూర్వ జన్మ సఖుడైన ఒక యోగి కన్పించి సుఖ దుఃఖాలను సమానం గా భావించాలని చెప్పి మళ్ళీ 50 ఏళ్ళ కు కని పిస్తానని చెప్పి వెళ్లాడు. సరిగ్గా యాభై ఏళ్ళ తరువాత శాస్త్రి గారు అమరావతి వెళ్లి అమరేశ్వర స్వామిని దర్శించి తమ గదిలో ప్రాణాయామం చేస్తూ చాలా పైకి లేచి తల క్రిందులు గా పడి పోతుంటే తల నే లకు తగిలే సమయాన ఆయోగి వచ్చి చేయి అడ్డం పెట్టి కాపాడాడు. శాస్త్రి గారు నమస్కరించ గానే యోగి అదృష్యుడైనాడు.
తండ్రి గారు మొదలు పెట్టిన ‘’శ్రీ రామ కదామృతం ‘’ను వారి మరణానంతరం శాస్త్రి గారు పూర్తీ చేస్తున్నారు అయోధ్యా కాండం లో గాయత్రీ మంత్రం లోని ‘’భకార’’వర్ణం తో పద్యం రావటం లేదు. అమ్మను ఉపాశించి నిద్ర పోయారు. కలలో ఒక బీబీ జగన్మోహిని నిద్రిస్తుండగా 30ఏళ్ళ గడ్డం వాడొకడు ఆమె చొక్కా పైకెత్తి పాలు తాగుతున్నాడు. శాస్త్రి గారు ఆ దృశ్యం చూస్తుంటే ‘’ఎందుకు నిల బడ్డావు ‘’?అని అడిగింది. ’’నాకూ పాలు ఇస్తావా ?’’అని అడిగారు. మెలకువ వచ్చి ‘’భర్మ మయ రమ్య హర్మ్యము ‘’అనే భ వర్ణం తో పద్యం తేలిగ్గా వచ్చింది
తాడి కొండ వేద పాథ శాలలో దేయాలు తిరిగి ఇబ్బంది పెడుతుంటే శాస్త్రి గారు మంత్రం పఠించి పార ద్రోలారు. ఒక సారి పుస్తక ముద్రణ కోసం చందాలకు తిరుగుతూ ఉంటె సత్తెనపల్లి లో ఒక బ్రాహ్మణుల ఇంట్లోకి ఇరవైయేళ్ళ యువతీ కని పించి, నమస్కరించి లోపలి వెళ్ళింది. ఆమె గ్రహ పీడి తురాలు. అందర్ని కొడుతూ, తిడుతూ ఉండేది. అలాంటిది శాస్త్రి గారిని చూడగానే అత్యంత వినయాన్ని ప్రదర్శించటం ఇంట్లో వారందరికి ఆశ్చర్యం కలిగించింది. ఆమెను గ్రహ ప్రేరణ చేసి ‘’ఏం చేస్తే నువ్వు పోతావు /’’అని అడిగారు. ’’సహస్ర గాయత్రీ జప ఫలం ధార పోస్తే పోతాను ‘’అంది. శాస్త్రి గారు సహస్ర గాయత్రి జపం చేసి ధార పోశారు. ఇంటి ముందున్న వేప చెట్టు కొమ్మ విరిగి పడింది. దెయ్యం వదిలింది. వేరొక సారి నాగుల చవితి రోజు కాలవ లో స్నానం చేసి వస్తుంటే నాగలి చాలులో పడుకొన్న నాగు పాము తోక పై ఆయన కాలు పడింది. అది బుసలు కొడుతూ పైకి లేచి కాటు వెయ బూనితే ‘’గారుడ మంత్రం ‘’జపించారు. సర్పం తల నేల కు వాల్చింది. ’’స్వామీ !నీ జోలికి నేను రాలేదు. నా జోలికి నువ్వు రావద్దు. పొరపాటున నా కాలు తగిలింది. వెళ్లి పొండి ‘’ అనగానే పాము వెళ్లి పోయింది. ఆ రోజంతా గారుడ మంత్రం పఠిస్తూనే ఉన్నారు.
శాస్త్రి గారు 90 ఏళ్ళ జీవిత కాలం లో 80 ఏళ్ళు ‘’బాలా మంత్రానుష్టానం ‘’చేసిన మహనీయులు. ఒక సారి కాశీ లో గంగా స్నానం చేస్తుంటే గంగా దేవి’గలగలా లాడే బంగారు చ్గాజులున్న చెయ్యి చూపించి ‘’నాకేమి కానుక తెచ్చావు ?’’అని అడిగింది. శాస్త్ర్రి గారికి ఏమీ పాలు పోక తన వ్రేలికున్న బంగారు దర్భ ఉంగరం తీసి ఆమె చేతి లో పెట్టారు. బసకు తిరిగి వచ్చి దేవతార్చన పెట్టె తెరిస్తే గంగకు అర్పించిన ఉంగరం అందులోనే ఉంది. తానేమైనా పొరపడి దర్భ ఉంగరం ఇవ్వలేదా అని సందేహించి ధ్యాన నిమగ్న మయ్యారు.. గంగమ్మ కని పించి ‘’కానుక ఇమ్మంటే దర్భ ఉంగరం ఇచ్చా వేరా ?’’అన్నది. ’’అది నీకు పితృ తర్పణం చెయ్యటానికి ఉప యోగ పడుతుంది కాని నాకు ఆభరణం ఎలా అవుతుంది ?’’అని గద్దించింది. ’’అమ్మా నేనేమీ నీ కోసం తేలేదు. ఆ సమయానికి అది స్పురించి ఇచ్చానంతే. ’’అన్నారు. మళ్ళీ గంగమ్మ ‘’నీ భార్యదగ్గర నాకోసం తెచ్చిన నగ ఉంది అది తెచ్చివ్వు ‘’అన్నది గంగ. శాస్త్రి గారు భార్యను అడిగి నగను తీసుకొని పోయి ‘’గంగార్పణం ‘’చేశారు.
ఆయన తన కార్య క్రమాలన్ని ముగించుకొని వాకిలి అరుగు మీద కూర్చుంటే వందలాది మంది వచ్చి తమకు ముహూర్తం పెట్టమనో, పేరు పెట్టమనో అడిగే వారు. కాసేపు కళ్ళు మూసుకొని ముహూర్త నిర్ణయం చేసే వారు. అంతే. ఆ కార్య క్రమం శుభప్రదంగా జరిగి పోయేది. దానికి తిరుగు లేదు. అదీ వారి మంత్ర సిద్ధి.
దాదాపు ముప్ఫై ఏళ్ళ క్రితం కాంచీ పరమాచార్యులు ఉయ్యూరు కే’సి’పి’వారి ఆహ్వానం, గురజాడ లోని చల్లా శర్మ గారు ఏర్పాటు చేసిన కార్య క్రమం లో వారం రోజులున్నారు. అప్పుడు రాఘవ శాస్త్రి గారు ఇక్కడే ఉన్నారు అన్ని రోజులు. అప్పుడు వారిని చూశాను. జగద్గురువుల ను వీరినీ ఒకే సారి చూసే భాగ్యం కలిగింది. అప్పుడే ‘’నడయాడే దైవం ‘’అని పరమా చార్య మీద పుస్తకం ఆవిష్కరణ జరిగి నట్లు జ్ఞాపకం.

తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రిగారు బయటకు వస్తే గృహస్థాశ్రమ ధర్మపు ఆచారం పాడైపోతుందని బాధపడేవారు. అప్పుడు పరమాచార్య స్వామివారు బ్రహ్మరథం(వేదం చదువుకున్న వారు మోసే పల్లకి) ఎక్కి శాస్త్రిగారి ఇంటికి వచ్చారు. వారింట్లో దిగి పరమాచార్య స్వామి వారు శాస్త్రిగారితో, “ఏమి నీ ఆచారానికి ఇబ్బంది వస్తోదని బెంగ పెట్టుకుంటున్నావా? ఇవ్వాళ మీ ఆచరానికి మేము కొత్తగా రక్ష కడుతున్నాం. ఇక నీకు ఇబ్బంది కలగదని” శాలువా తీసి కప్పారు.

పరమాచార్య స్వామి వారు శాలువా కప్పడము అంటే అంగరక్ష కట్టినట్టే. “ఇంక నీకు బెంగ లేదు. ఇప్పుడు బయటకు వచ్చినా ఏమి ఇబ్బంది కలగదు” అని అన్నారు. ఆ గురు శిష్యుల సంబధం అటువంటిది.

పరమాచార్య స్వామి వారు కూర్చొని ఉండగా శాస్త్రిగారు వారి తండ్రిగారైన కీర్తి శేషులు తాడేపల్లి వెంకటప్పయ్యశాస్త్రులు గారు ‘రామ కథామృతము’ అనే గ్రంథం రచించారు. దాన్ని స్వామి వారి ముందు చదువుదామని శాస్త్రి గారు వెళ్ళారు. పరమాచార్య స్వామి వారు లోపలికి రమ్మన్నారు. శాస్త్రిగారు ఆ పుస్తకాన్ని చదువుతున్నారు.

పరమాచార్య స్వామి వారు “పద్యాలు చాలా బాఉన్నాయి. చదువు చదువు” అని అంటున్నారు. ఇంతలో స్వామి వారి సేవకులొకరు వచ్చి “పెరియావ బెంగళూరు నుండి ఒకరు వచ్చారు. పీఠానికి ఇవ్వాలని చాలా డబ్బు తెచ్చారు. మీ దర్శనం చేసుకుని డబ్బు ఇచ్చి వెడతాము అని అంటున్నారు” అని చెప్పాడు. స్వామి వారు అతనితో కాసేపాగమను అని నువ్వు చదువు అని శాస్త్రిగారిని అన్నారు.

సేవకుడు మరలా వచ్చి “వారికి ఏదో పని ఉన్నది కావున తొందరగా మీ దర్శనం చేసుకొని వెళ్ళలాట” అని చెప్పాడు. కాని స్వామి వారు ఏమి మాట్లాడక శాస్త్రి గారి వైపు తిరిగి చదువు అని అన్నారు. సేవకులు మరలా వచ్చి అదే విషయం చెప్పారు. “ఆ బెంగళూరు ఆయనకు ఏదో పని ఉన్నదట. మీరు ఒక్కసారి దర్శనం ఇస్తే చూసి డబ్బిచ్చి వెళ్ళిపోతాడట. వారిని పంపమంటారా?”.

ఈ విషయాన్నంతా చూసి, శాస్త్రి గారు “అరే ఏమిటిది నేను ఇలా కూర్చుని పద్యాలు చదువుతూ ఉండడం వల్ల స్వామి వారికి ఇబ్బంది కలుగుతున్నట్టు ఉంది” అని లోలోపల బాధపడుతున్నారు.

అప్పుడు పరమాచార్య స్వామి వారు ఆ సేవకులతో, “అతను డబ్బు తెచ్చాడని అతనితో ముందు మాట్లాడాలా? లేక రామాయణం కన్నా అతను వచ్చి మాట్లాడడం గొప్ప అని అనుకుంటున్నాడా? నన్ను దర్శనం చెయ్యాలనుకుంటే తరువాత రమ్మను లేదా వేచి ఉండమను. నాకు ఈ రామాయణమే గొప్పది” అని అన్నారు.

శాస్త్రి గారి తండ్రి గారు వ్రాసిన ఆ రామాయణం ఎందుకు గొప్పదో లోకానికి తెలియజెప్పాలని అనుకున్నారు స్వామి వారు. శాస్త్రిగారిని ఇలా అడిగారు.

”ఏమయ్యా రాముడు సీతమ్మ తల్లితో అగ్నిప్రవేశం చెయ్యంచాడు కదా. సీత అగ్నిపునీత అని తెలుసు కదా! ఇంత తెలిసిన తరువాత కూడా ఎవరో ఎక్కడో ఒక పౌరుడు ఏదో నింద చేసాడని సీతని పరిత్యజించడం న్యాయమా? సరే రాజారాముడు చిన్న అవమానం వచ్చినా ఆ పదవిలో కూర్చోవడానికి ఇష్టపడడు అందుకే పరిత్యజించాడు అని వాల్మీకి చెప్పాడు. ఎందరో కవులు కూడా అదే చెప్పారు. నేను ఎనభై రామాయణాలు (వాల్మీకి రామాయణం , కంబ రామాయణం, భాస్కర రామాయణం, హనుమద్ రామాయణం, ఆధ్యాత్మ రామాయణం, మొల్ల రామాయణం మొ||) చెదివాను. ఒక్కొక్క కవి ఒక్కొక్కరకంగా చెప్పారు. మరి మీ నాన్న గారు ఈ విషయాన్ని ఎలా సమర్థించారు?” అని అడిగారు.

శాస్త్రి గారు ఆ ఘట్టం తీసి, ఇలా వివరణ ఇచ్చారు “రాముడు సీతమ్మ తల్లిని రాజు కాకముందు పెళ్ళి చేసుకున్నాడు. అప్పడి రాముడు రాజకుమారుడు అంతే. యుద్ధం తరువాత సీత అగ్నిపునీత అని లోకానికి చాటి పట్టాభిషేకం చేసుకున్నాడు. ఒకనాడు మంత్రులలో ప్రభువుకు నీతి పాఠం చెప్పే మంత్రి వచ్చి రాముడు ఏకాంతలో ఉండగా,

“ప్రభూ! మీరు వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు. లోకానికి ధర్మం నేర్పడానికి రామచంద్రమూర్తిగా వచ్చి నరుడిగా ఈ భూమిపై నడుస్తున్నారు. ఇటువంటి మీరు ప్రభువు కాకముందు సీతమ్మను భర్యగా ఉంచుకున్నారు. ధర్మానికి తప్పులేదు. ప్రభువయ్యాక సీతమ్మ భార్యగా ఉండవచ్చా?” అని అడిగారు.

“ఎందుకుండకూడదు?” అని అడిగారు రాములవారు. అందుకు మంత్రి, “ప్రభువు భూమిపతి. అంటే ఈ భూమికి భర్త. మరి అప్పుడు భూమాత తనయ సీతమ్మ మీకు ఏమవుతుంది? మీరు రాజారాముడయ్యాక మీరు ఏకపత్నీవ్రతుడు కాబట్టి భూమికి మాత్రమే భర్తగా ఉండాలి. మరి ఇప్పుడు ధర్మం నిలిచిందా?” అని అడిగాడు. ఉలిక్కిపడిన రాముడు కారణం చెప్తూ ధర్మం కోసమే సీతమ్మను అడవికి పంపించాడు రాముడు” అని చెప్పారండి మా నాన్న గారు అని అన్నారు.

ఈ మాటలు విని పరమాచార్య స్వామి వారు పరవశించిపోయారు. ఇన్ని రామాయణాలు విన్నాను గాని ఇలా సమర్థించిన వాణ్ణి వినలేదు అని “ఆ పుస్తకాల సెట్టు ఒకటి అక్కడ పెట్టిపో” అన్నారు. ”తమకు నాగర లిపి వచ్చు. అరవ లిపి వచ్చు. మరి తెలుగు లిపి పరిచయమేనా?” అని శాస్త్రి గారు అడిగారు. ”నాకు అక్షరాలు వస్తేనేమి, రాకపోతేనేమి? పుస్తకాలు పెట్టి పూజ చేస్తాను. ఒక సెట్టు ఇవ్వు” అన్నారు. తరువాత కొంత కాలానికి శాస్త్రి గారు పరమాచార్య స్వామి వారి దర్శనానికి వెళ్ళారు. స్వామి వారు ఒకగంటసేపు పురాణం చేసారు. తరువాత స్వామి వారు ఈ కింది పద్యం చదివారు.

కనుమీ నీ నగుమోము మేల్సిరికి లక్ష్యం బౌటకున్ ల
జ్జెనెట్టగ మున్మున్న మునింగి కొండచరిబాటం జారె రేరేడటం
చనుమోదించుట బద్మినీపతి నిజుస్య స్మేర దృష్టి ప్రసా
ర నవోల్లాసిత హ్రీణయై తెలిపెడిన్, రామా! జగన్మోహనా!!

ఇది శాస్త్రి గారి తండ్రి గారు వ్రాసిన ‘రామ కథామృతము’లో బాలకాండ, నవమాశ్వాసములోనిది. విశ్వామిత్రుడు శ్రీరాముని నిద్రలేపు సందర్భం. మహాస్వామి వారు పై పద్యం చదివి, “మీ నాన్నగారు దారినపోతూ ఎప్పుడూ ఈ పద్యం చదువుతూ ఉండేవారు కదా?” అని శాస్త్రి గారిని అడిగారు.

ఏనాడో గతించిన వారి నాన్నగారు ఆ పద్యాన్ని ఎంత ఆర్తిగా చదివే వారో అలాగే స్వామి వారు ఎట్లా చదవగలిగారు!


 10-12-1990 ప్రమోదూత మార్గ శిర బహుళ నవమి నాడు శాస్త్రి గారు బాలా త్రిపుర సుందరి అమ్మ వారి ఒడిలోకి శాశ్వతంగా చేరి పోయారు. వారి పార్ధివ దేహానికి అగ్ని సంస్కారం చేస్తున్నప్పుడు అమ్మ వారి ఆకారంగా చితి మంటలు ఆకాశానికి లేవటం ఎందరో చూసి పరమాద్భుతంగా వర్ణించారు. శాస్త్రి గారు కారణ జన్ములు. వారి పేరు వింటే చాలు సకల శుభాలు జరుగుతాయి.
🙏🙏🙏

Friday, April 3, 2020

‘‘మాసికాలు ఎందుకు పెట్టాలి?‘‘‘‘అన్ని మాసికాలు పెట్టాలా? కొన్నిమానేయవచ్చా?‘‘మాసికాల రహస్యం ఇదే!

మాసికాల రహస్యం ఇదే!

అనంతసాహితి-పితృదేవతారాధనా రహస్యాలు- 045

‘‘మాసికాలు ఎందుకు పెట్టాలి?‘‘
‘‘అన్ని మాసికాలు పెట్టాలా? కొన్నిమానేయవచ్చా?‘‘
-----------------------------------------------------
మహాభారతంలో చాలామందికి తెలియని ఒక విచిత్రఘట్టం ఉంది. అది వ్యాసప్రసాదితమై ఈ విధంగా ఉంది.
కురుక్షేత్రంలో జరిగిన భీకరసంగ్రామంలో 18 అక్షౌహిణుల సైన్యం 18 రోజుల్లో నాశనం అయింది. కలుగులోని ఎలుకలా దాక్కున్న దుర్యోధనుడిని బయటకు లాగి చంపేశారు.  అనంతరం మృతులకు పూర్వక్రియలు, ఔర్థ్వక్రియలు చేయడానికి అంతా గంగా నది చెంతకు చేరుకున్నారు. ఆ సమయంలో అంతఃపుర కాంతలు అందరితో ధృతరాష్ట్రుడు కూడా వచ్చాడు. వచ్చిన వారి ఏడుపులతో ఆ ప్రాంతం హృదయవిదారకంగా తయారైంది. అప్పుడు అది చూసిన వ్యాసుడు వారికి ఒక వరం ఇచ్చాడు. చనిపోయిన వారిలో ఎవరిని చూడాలనుకుంటే వారిని చూసే వరం అక్కడకు వచ్చిన వారికి ఇచ్చాడు. దాంతో అంతా తాము చూడాలనుకుంటున్న వారిని స్మరించారు. వారు కోరుకున్న వారంతా అక్కడకు ప్రత్యక్షం అయ్యారు. సంతోషంగా తమ ఇష్టులతో వారు గడిపిన కాసేపు అయిన తరువాత చనిపోయిన వారు వెళిపోయే సమయం వచ్చింది. అప్పుడు వ్యాసుడు ‘‘చనిపోయిన వారితో ఎవరైనా వెళ్ళదిలస్తే వారు కూడా వెళ్ళవచ్చు‘‘ అని మరో వరం ఇచ్చాడు. కొంతమంది తమ ప్రియాతి ప్రియమైన వారి ప్రేతాత్మతో కలసి  వెళిపోయారు. 

ఇది చాలా అరుదైన వరం. చనిపోయిన వారిని చూడవచ్చా? అంటే చర్మచక్షువులతో చూడలేము. కేవలం జ్ఞానచక్షువులు, వ్యాసాది మహర్షులిచ్చే దివ్యచక్షువులతో చూడగలము అని ఈ ఘట్టం ద్వారా తెలుసుకోవచ్చు. అయితే నేడు పితృయజ్ఞాలను అవహేళన చేసే వారు ఎక్కువయ్యారు. వేదవేదాంతాలలో ఉన్న మహాసాధనా రహస్యాలు చెపుతుంటే చొప్పదండు ప్రశ్నలు వేసేవారు కొందరైతే, మరికొందరు తమ సున్నతమైన వేదబోధ గమనించకుండా కుతర్కాలు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ పితృయజ్ఞాలలోనే ఉంది. అతి తేలిగ్గా సకల పుణ్యాలు, సకల సంపదలూ ఇచ్చే ఈ పుణ్యకార్యాలు ఆచరించకుండా పిశాచగ్రస్తులు అడ్డుపడుతుంటారు. కనుకనే ఈ మంచి మాటలు వారి చెవులకు సోకవు. కేవలం పితృదేవతల అనుగ్రహం ప్రాప్తం ఉన్నవారిని మాత్రమే ఇవి చేరుకుంటాయి. 

చాలా మందికి కొన్ని మంచి సందేహాలు కూడా  వచ్చాయి. చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు? మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరుతాయి? దేవతగా ప్రేత ఎలా మారుతుంది? పిండాల వల్ల ప్రయోజనం ఏమిటి? అనేవి అందులోని ముఖ్యప్రశ్నలు.

వీటికి సమాధానం ఒక ఉపనిషత్తు చెబుతోంది. ఆ ఉపనిషత్తు పేరు పిండోపనిషత్తు. ఇది అథర్వణ వేదశాఖకు చెందినది. ఈ వేదం ఎక్కువగా కర్మయోగానికి చెందినది. ఇందులో నిత్యనైమిత్తికకామ్య యజ్ఞాలు ఎలా చేయాలో ఎక్కువగా ఉంటుంది. దీనికి చెందిన ఈ ఉపనిషత్తులో ఈ రహస్యాలు చెప్పారు.

బ్రహ్మదేవుని దేవతలు, మహర్షులు ఈ విధంగా ప్రశ్నించారు.
మృతులకు సమర్పించిన పిండాలను వారు ఏవిధంగా స్వీకరిస్తారు? అనే ప్రశ్నలు వేశారు. దానికి సమాధానంగా బ్రహ్మ దేహం దేహి గురించి వివరాలు చెప్పాడు.

మరణించిన తరువాత పాంచభౌతికమైన శరీరం నుంచీ పంచభూతాలూ విడిపోతాయి. ఈ శరీరం భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం అనే మహాభూతాలతో ఏర్పడింది. ఎప్పుడైతే ఇందులోని దేహి శరీరం నుంచీ వెళిపోతాడో, పంచభూతాలు కూడా ఎలా వచ్చినవి అలానే వెళిపోతాయి. ఇది ఆధునిక వైద్యశాస్త్రజ్ఞలు కూడా అంగీకరించినదే. ముందుగా గాలి వెళిపోతుంది (ఊపిరి తీసుకోవడం). దాని వలన పంచప్రాణాలు పోతాయి. గాలి తరువాత అగ్ని పోతుంది. శరీరం చల్లబడుతుంది. వైశ్వానరాగ్ని వెళిపోతుంది. తరువాత శరీరంలో ఉన్న నీరు తోలుతిత్తిలోని తొమ్మిది రంధ్రాల నుంచీ కారిపోతుంది. ఎప్పుడైతే గాలి, నీరు, నిప్పు శరీరం నుంచీ తప్పుకున్నాయో భూతత్త్వం అయిన ధాతువులు ఎముకలు వెంట్రుకలు గోళ్ళు వంటి రూపంలో మిగులుతాయి. ఇవి భూమిలో కలిసిపోతాయి. శరీరాకాశం మహాకాశంలో కలిసిపోతుంది. క్లుప్తంగా జరిగేది ఇదే. ఇది పంచభూతాలు వెళిపోయే విధానం.

నిజానికి మనకు కనిపించే స్థూలమైన బాహ్య శరీరంతో పాటుగా ప్రతీ ఒక్కరికీ కారణ శరీరం, యాతనా శరీరం అని ఉంటాయి. కారణ శరీరం మరో జన్మకు మనం చేసుకున్న పాపపుణ్యాల సంచులు మోసే శరీరం. తన సంచుల్లో ఉన్న పాపపుణ్యాల ప్రకారం  మరో శరీరం వెతుక్కుంటూ వెళిపోతుంది. అదే నూతన శరీరం పొందుతుంది. యాతనా శరీరం నరకానికో లేక స్వర్గానికో వెళిపోతుంది. ఇలా వివిధ శరీరాలు ఎవరి దోవన అవి వెళిపోతే మృతుని ప్రేత మిగిలి ఉంటుంది. 

ప్రేత ముందు పదిరోజులూ తన ఇల్లూ, తన పరివారం, తన ఆస్తులు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో వేసే నిత్యపిండం కాకి రూపంలో వచ్చి తీసుకుంటుంది. దీని తరువాత పదోరోజున సపిండులు, సగోత్రీకులు, బంధువులు, స్నేహితులు వచ్చి వదిలే ఉదకాలు దాని దాహాన్ని తీరుస్తాయి. వీటికి తృప్తి పడి అది పదిరోజుల తరువాత తన వారిని, నా అనుకునే వారిని వదిలి వెళిపోతుంది. అయితే ఇది ప్రేత రూపంలోనే ఉంటుంది. పూర్వక్రియలు అయిన దహన సంస్కారాది 12 రోజుల క్రియలు పూర్తి అయి, మధ్యమ క్రియలు అయిన మాసికాలు జరిగి, పూర్వక్రియలకు అర్హమైన సపిండీకరణం జరిగే వరకూ   ఈ ప్రేత రూపంలోనే ఉంటుంది. సపిండికరణం తరువాత తన ముందున్న వర్గత్రయంలో తన తండ్రి తాత ముత్తాతల్లో ముత్తాతను ముందు జరిపి ఆయన ఖాళీలో తాతను, తాత స్థానంలో తండ్రిని, తండ్రి స్థానంలో తాను చేరుకుంటుంది. పితృదేవతాస్థానం పొందుతుంది.

దీనికి కావలసిన క్రొత్త శరీరం మాసికాల ద్వారా చేసే ఏకోద్దిష్టశ్రాద్ధాల రూపంలో అందుతుంది. నిన్నటి బాహ్యశరీరాన్ని విడిచి కారణశరీరం, యాతనా శరీరం కోల్పోయి ప్రేతగా ఏ శరీరం లేకుండా ఉన్న మృతుడు మాసికాలలో కేవలం తనకు మాత్రమే ఉద్దేశించి వదిలే పిండాల ద్వారా క్రొత్త శరీరం సంతరించుకుంటాడు.  

వీటిలో మొదటి పిండం  ద్వారా క్రొత్త శరీరానికి బీజం పడుతుంది. దీన్నే కలనం అన్నాడు. 

దీని తరువాత మాంసం చర్మం రెండో పిండం ద్వారా ఏర్పడతాయి. 

మూడో పిండం వలన బుద్ధి కలుగుతుంది. (మెదడు). 

నాలుగో పిండం వలన ఎముకలు, ఎముకల్లోని గుజ్జు ఏర్పడతాయి. 

ఐదో పిండం వలన శిరస్సు, ముఖం, వేళ్ళు ఏర్పడతాయి. 

ఆరో పిండం వలన హృదయం, మెడ, నోటిలోని భాగాలు  ఏర్పడతాయి.

ఆయుప్రమాణం ఏడో పిండం ద్వారా కలుగుతుంది. 

ఎనిమిదో పిండం ద్వారా మాటకు చెందిన వ్యవస్థలు కలుగుతాయి.  

తొమ్మిదో పిండం ద్వారా అన్ని అవయవాలకు పరిపుష్టి చేకూరి దృఢపడతాయి. 

పదో పిండం వలన క్రొత్త జీవితానికి అవసరమైన శారీరక పరిపూర్ణత చేకూరుతుంది.

ఈ విధంగా మాసికాలలోని పిండదానం వలన పిండశరీరం నుంచీ సంపూర్తి శరీరం పిండాల వలన కలుగుతుంది. ప్రపంచంలో భోగాలు అనుభవించడానికి శరీరం ఇచ్చిన తల్లి తండ్రులకు మాసికాలు నిర్వహించి వారికి శరీరం ఏర్పడడానికి అవసరమైన పిండాలు సమర్పించి వారి ఋణం తీర్చుకోవాలి.
 
నిజానికి మొత్తం 16 పిండాలు ఈ సంవత్సర కాలంలో ఇస్తారు. వీటిలో 10 పిండాల గురించి  మృతుడు క్రొత్త శరీరాలు పొందడానికి దోహదం చేసే ఆహారంగా ఉపయోగిస్తాయని పిండోపనిషత్తు చెప్పింది, మిగిలిన పిండాల గురించి గరుడపురాణంతో పాటు అనేక పురాణాలు చెబుతున్నాయి.

అంతేకాక మృతుని శరీరం నుంచీ పంచభూతాలు ఏవిధంగా దూరం అవుతాయో అదే విధంగా తిరిగి వారికి భౌతిక శరీరం ఏర్పడడానికి పంచభూతాలూ కలుస్తాయి. ముందుగా జీవికి ఆస్తిక్యం ఇవ్వడానికి కారణం అయిన ఆకాశం అతనికి స్థలం ఇస్తుంది. ఆ తరువాత అగ్ని, జలం, వాయువు, భూమి తత్త్త్వాలు అతనికి శరీరం కల్పిస్తాయని ఉపనిషత్తు చెబుతోంది. 

కనుక మృతులకు మాసికాలు అన్నీ పెట్టవలసిందే. మాసికాలకు ప్రత్యామ్నాయం లేదు. ఏది వదిలితే అది ఎన్నో పిండమైతే ఆ దశలో ఏర్పడాల్సినవి ఏర్పడక మృతునికి వైలక్యం కలుగుతుంది. మనకు కోట్లు ఖరీదు చేసినా దొరకని భోగశరీరాన్ని ఇచ్చిన తండ్రికి ఇంత పిండం పెట్టకపోవడం వలన అతనికి వైకల్యం కలిగించినవారమవుతాము. మహాఘోరమయ్యే తప్పు చేయకూడదు. 

మాసికాలు మానివేస్తే ఇటువంటి వైకల్యం కలుగుతుంది. సపిండీకరణం చేయకపోతే పితృదేవతా రూపం రాదు. తండ్రికి ప్రేతత్త్వం విడుదల చేయకపోతే తరువాత తరాలు అన్నీ ప్రేతత్త్త్వంలోనే ఉండిపోతాయి. కనుక మధ్యమ క్రియలైన మాసికాదులు చేయడం చనిపోయిన వారికి మాత్రమే కాదు, కర్తకు కూడా లాభం చేకూర్చేది. తనకు దుర్గతి రాకుండా మంచి మార్గం వేసుకోవడం వంటిది. 

ఇవి మన పురాణాలు, ఉపనిషత్తులు చెబుతున్న పితృయజ్ఞరహస్యాలు.   

ఇవన్నీ సమాన్యంగా తప్పనిసరిగా చేయవలసినవి. ఇవే మరింత ప్రేమగా చేయాలనుకుంటే పుణ్యక్షేత్రాలైన కురుక్షేత్రం, ప్రయాగ, కాశీ, గయా వంటి వాటిలో చేయాలి. ఇలా చేస్తే వారికి విశేషమైన శరీరాలు కలిగించిన వారమవుతాము. దాని వల్ల మనకే ప్రయోజం ఉంటుంది. వారికి కలిగే ఉత్తమ శరీరాల వల్ల పరమానందం పొంది మరింతగా సకల సంపదలు మనకు ఇస్తారు.

పిండాలు ప్రేతాలకు వెళతాయా? అని వితండవాదం చేసే వారికి సమాధానమే ఈ పిండోపనిషత్తు. 

నిజానికి ఉపనిషత్తులు అన్నీ రహస్యాల సమూహాలు. అవి పైకి ఒక అర్ధంలో కనిపించే సామాన్యపదాలుగా కనిపించినా వాటి వెనుక కేవలం మహాసాధకులకు మాత్రమే తెలిసే అనేక రహస్యాలు ఉంటాయి. అవి కేవలం సాధకులు, పరిశ్రమ చేసిన విజ్ఞులు మాత్రమే అందుకోగలుగుతారు. వీటిని వారు అందరికీ చెప్పరు. కేవలం ఫలానా పిండదానాలు ఫలానా చోట చేయండి అనిమాత్రమే చెబుతారు. గయలో ఎందుకు చేయాలి? ప్రయాగలో ఎందుకు చేయాలి అంటే వాటికి అనేక రకాలైన కారణాలు కూడా చెబుతారు. పుణ్యక్షేత్రాలుగా చెబుతున్న ప్రాంతాలు అన్నీ పరమాత్మ శరీరాంగాలు. ఒకటి శిరస్సు, మరొకటి హృదయం, కాళ్ళు, చేతులు.... వంటివి. 

ఇలా ఆ ప్రాంతాలలో చేయలేని వారు కనీసం తాను ఉన్న చోటునైనా చేయాలి. వెళ్ళగలిగిన వారు ప్రయాగ కుంభమేళాల వంటి వాటికి వెళ్ళి చేయడం వలన దివ్యమైన ఫలితాలు పితృదేవతానందం వలన కలుగుతాయి.  
వెళ్ళలేని వారు మానసికంగా అయినా వాటిని కీర్తించడం వలన పుణ్యం పొందుతారు. 

ఉదాహరణకు రాబోయే మాఘపౌర్ణమి చాలా మంచిది. దాన్ని మాఘపౌర్ణమి, మహామాఘి అని అంటారు. ఆ రోజున పితరలకు ప్రయాగలో పిండప్రదానం చేస్తే దివ్యమైన ఫలాలు, సంపదలు కలుగుతాయి. ప్రయాగలో చివరిగా రాబోతున్న మహాశివరాత్రి స్నానానికి ముందు రానున్న పుణ్యదినం.  ఆ సమయానికి వెళ్ళలేని వారు మానసికంగా అయినా తమపెద్దలకు నమస్కరించుకొని స్వధానామసాధన చేసి, స్వధా స్తోత్రం, పితృస్తోత్రం పఠించుకొని ఆవుకు ఒకరోజు గ్రాసం వేయడం వలన కూడా ఉత్తమ పుణ్యసంపదలు ఉన్న చోటు నుంచే పొందవచ్చు.

ఇవే మాసికాలు పిండప్రదానాల రహస్యాలు. 

మాఘమాసం పితృదేవతా అర్చనలకు మహాదివ్యమైన కాలం. 

 దివ్యాత్మస్వరూపులారా!

ఇప్పటి వరకూ స్వధానామసాధన, స్వధాస్తోత్రపఠనం చేసిన సాధకులకు ఇదిసాధనలో రెండో సోపానం. సాక్షాత్తూ బ్రహ్మదేవుడు చెప్పగా వ్యాసభగవానుడు ప్రసాదించిన దివ్యమైన పితృస్తోత్రం అందిస్తున్నాము.  దీన్ని చదువుకున్న వారి సర్వపాపాలూ పితృదేవతైన తండ్రి తొలగిస్తాడు. ఇది మూడు కాలాలలో లేదా రెండు కాలాలలో లేదా కనీసం రోజుకు ఒక సారి అయినా చదువుకుంటే సకల దరిద్రాలూ తొలగిపోతాయి. సకల కష్టాలూ తొలగిపోతాయి. సర్వకార్యాలలో జయం సిద్ధిస్తుంది. సకల దేవతలూ సంతోషించి సకల కోరికలూ తీరుస్తారు. 

దీన్ని స్వధా స్తోత్రం అనంతరం చదువుకోవాలి. తండ్రి బ్రతికే ఉన్నవారు ఇంకా అదృష్టవంతులు. ఈ స్తోత్రాన్ని తండ్రి సన్నిధిలో చదువుకొని ఆయన పాదాలకు నమస్కరించుకుంటే దివ్యమైన ఫలితాలు కలుగుతాయి. చేసిన పాపాలు అన్నీ నాశనం అవుతాయి. 
🙏🏻🙏🏻🙏🏻

Thursday, March 26, 2020

జన్మ నక్షత్రాన్ని అనుసరంచి మనం పెంచాల్సిన వృక్షాలు మరియు వాటి వల్ల మనకు కలిగే ఫలితాలు ?


జ్యోతిష్య శాస్త్రం లో 27 నక్షత్రాలకు ప్రత్యేక దేవతలు , అధిదేవతలు ఉన్నట్లుగానే , వాటికి సంబంధించిన వృక్షాలు/చెట్లు కూడా ఉన్నాయి

జన్మ నక్షత్రాన్ని అనుసరంచి మనం పెంచాల్సిన వృక్షాలు మరియు వాటి వల్ల మనకు కలిగే ఫలితాలు

అశ్వని నక్షత్రం - వారు విషముష్టి లేదా జీడిమామిడిని పెంచడం, పూజించడం వలన జననేంద్రియాల, మరియు చర్మ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. చెట్లని పెంచి పూజించడం ద్వారా సంతాన అబివృద్ది కలుగుతుంది. అలాగే, అన్ని విషయాలలోనూ సూటి గా వ్యవహరించడం, సమయాన్ని వృదా చేయకుండా అన్ని పనులను సమర్ధవంతంగా నిర్వహించడం కొరకు చక్కగా ఉపయోగపడుతుంది.

భరణి నక్షత్రం - వారు ఉసిరి చెట్టును పెంచడం, పూజించడం ద్వారా జీర్ణ వ్యవస్థ , ఉదర సంబంధిత, పైత్యము , పైల్స్ వంటి బాధల నుండి ఉపశమనం పొందగలరు. అలాగే వీరికి క్రియేటివిటి ఎక్కువ గా ఎక్కువగా ఉన్న వృత్తులను ఎంచుకొని చక్కగా రాణించడానికి ఉపకరిస్తుంది

కృత్తిక నక్షత్రం - వారు అత్తి/మేడి చెట్టును పెంచడం పూజించడం ద్వారా గుండె సంబంధిత సమస్యల నుండి రక్షింపబడతారు, అలాగే సంపూర్ణ ఆరోగ్యం కూడా చేకూరుతుంది. అలాగే చక్కటి వాక్చాతుర్యం, ఏదైనా చేయాలనీ సంకల్పిస్తే ఎటువంటి విమర్శలనైన తట్టుకొని నిలబడే శక్తి కలుగుతాయి.

రోహిణి నక్షత్రం - వారు నేరేడు చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా చక్కెర వ్యాధి మరియు నేత్ర సంబంధిత సమస్యల నుండి బయటపడగలరు. అలాగే మంచి ఆకర్షణీయమైన రూపం , సత్ప్రవర్తన ఎక్కువ గా కలుగుతాయి. వ్యవసాయం, వాటికి సంబందించిన వృత్తులలో చక్కగా ఎదగడానికి ఉపయోగపడుతుంది

మృగశిర నక్షత్రం - వారు మారేడు లేదా చండ్ర చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా గొంతు, స్వరపేటిక, థైరాయిడ్ మరియు అజీర్తి సమస్యల నుండి బయటపడతారు. ముఖ్యంగా బుధవారం రోజు పూజించడం వలన ఆర్దికపరమైన చిక్కుల నుండి బయటపడగలరు.

ఆరుద్ర నక్షత్రం - వారు చింత చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా గొంతు, స్వరపేటిక సంబంధిత సమస్యల నుండి బయటపడతారు, అంతే కాకుండా విషజంతువుల బాధ కుడా వీరికి కలగదు. వీరి మనస్తత్వాన్ని అనుకూలమైన దిశగా మార్చుకొని విజయాలు సాధించడానికి ఉపయోగపడుతుంది

పునర్వసు నక్షత్రం - వారు వెదురు లేదా గన్నేరు చెట్టు ను పెంచడం , మరియు పూజించడం ద్వారా ఊపిరితిత్తుల కి సంబందించిన వ్యాధులు క్షయ, ఉబ్బసం శ్వాసకోస బాధల నుండి, మరియు రొమ్ము క్యాన్సర్ నుండి ఉపశమనం పొందుతారు. బాలింతలు దీనిని పెంచడం వలన ముఖ్యం గా పాల కి లోటు ఉండదని చెప్పవచ్చు. పెద్ద పెద్ద సమస్యలు వచ్చినా , చక్కటి చాకచక్యం తో మెలిగి బయటపడడానికి ఉపయోగపడుతుంది.

పుష్యమి నక్షత్రం - వారు రావి లేదా పిప్పిలి చెట్టును పెంచడం, పూజించడం వలన నరాల సంబంధిత బాధలు నుండి విముక్తి పొందుతారు. అలాగే శత్రువుల బారి నుండి రక్షణ కలుగుతుంది. రోగ, రుణ భాధల నుండి విముక్తి లభిస్తుంది . స్త్రీలు సంతానవతులవుతారు.

ఆశ్లేష నక్షత్రం - వారు సంపంగి లేదా చంపక వృక్షాన్ని పెంచడం , పూజించడం వల్ల శ్వేతకుష్ఠు మరియు చర్మ సంబంధిత వ్యాదుల నుండి రక్షణ పొందగలరు అలాగే ముందు చూపు తో వ్యవహరించి జీవితం లో ముందుకు సాగడానికి ఎంతటి విషమ పరిస్థితుల్లోనైన తట్టుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది.

మఖ నక్షత్రం - వారు మర్రి చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా ఎముకల సంబంధిత మరియు అనుకోని వ్యాదుల నుండి రక్షింపబడతారు. అలాగే భార్య భర్తలు ఎంతో అన్యోన్యం గా ఉండడానికి, తల్లితండ్రులకు, సంతానానికి కూడా మేలు జరుగుతుంది. జీవితం లో వీరు తలపెట్టే ముఖ్యమైన కార్యాలలో ఆటంకాలు కలగకుండా ఉంటాయి

పుబ్బ నక్షత్రం - వారు మోదుగ చెట్టు ని పెంచడం, పూజించడం ద్వారా సంతానలేమి సమస్యల నుండి బయటపడతారు. అలాగే మంచి సౌందర్యం కూడా చేకూరుతుందని చెప్పవచ్చు .ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపడడానికి ఎటువంటి వ్యవహారాలలోనైన తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది.

ఉత్తర నక్షత్రంవారు జువ్వి చెట్టు ని పెంచడం, పూజించడం ద్వారా హృదయ సంబంధిత వ్యాధుల నుండి బయటపడతారు. ఇతరులకు సహాయ సహకారాలని వారి చేతనైనంతగా అందించడానికి. మంచి ప్రవర్తనతో చుట్టూ స్నేహితులను చేసుకోవడానికి ఉపయోగపడుతుంది

హస్త నక్షత్రం - వారు సన్నజాజి , కుంకుడు చెట్లను పెంచడం, పూజించడం వలన ఉదర సంబంధిత బాధల నుండి ఉపశమనం పొందుతారు. పరిస్థితులను తట్టుకొని అన్నిటికీ ఎదురీది విజయం సాధించడానికి . దైవభక్తి కలగడానికి ఉపయోగపడుతుంది.

చిత్త నక్షత్రం - వారు మారేడు లేదా తాళ చెట్టు ను పెంచడం, పూజించడం ద్వారా పేగులు, అల్సర్ మరియు జననాంగ సమస్యల నుండి బయటపడగలరు. ఎవరిని నొప్పించకుండా వారి తెలివి తేటలతో ఇతరులను చిత్తు చేయగలిగిన నైపుణ్యం కలగడానికి ఉపయోగపడుతుంది.

స్వాతి నక్షత్రం - వారు మద్ది చెట్టు ను పెంచడం, పూజించడం ద్వారా స్త్రీలు గర్భసంచి సమస్యల నుండి బయట పడగలరు అలాగే ఉదర సంబంధిత సమస్యలు దరిచేరవు. అన్ని రకములైన విద్యలలోను రాణిస్తారు, ఆత్మవిశ్వాసం అధికం గా ఉంటుంది. భావోద్వేగాలు అధికం గా ఉన్నా తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది.

విశాఖ నక్షత్రం - వారు వెలగ , మొగలి చెట్లను పెంచడం ద్వారా జీర్ణసంబంధిత సమస్యల నుండి బయటపడతారు. ఎటువంటి పరిస్థితులనైన తట్టుకొని నిలబడడానికి, ముందు చూపు తో అన్ని విషయాలను గ్రహించి ముందుకు సాగడానికి, వృత్తిరీత్యా మంచి గౌరవ మర్యాదలు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది.

అనురాధ నక్షత్రం - వారు పొగడ చెట్టు ని పెంచడం, పూజించడం ద్వారా కాలేయ సంబంధిత సమస్యల నుండి బయటపడగలరు. పదిమంది లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకోవడానికి, పరోపకారం చేయడానికి, విద్యలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా, పట్టుదలతో వాటిని అధిగమించి ముందుకు సాగడానికి, ఆలోచనా శక్తి అబివృద్ది చెందడానికి ఉపయోగపడుతుంది.

జ్యేష్ఠ నక్షత్రం - వారు విష్టి చెట్టు ని పెంచడం, పూజించడం ద్వారా కాళ్ళు, చేతుల సమస్యలు, వాతపు నొప్పుల నుండి ఉపశమనం పొందుతారు. చిన్నతనం నుండే బరువు భాద్యతలు సమర్దవంతం గా మొయగలగడానికి. ఆత్మవిశ్వాసం తో ముందుకు సాగడానికి ఉపయోగపడుతుంది.

మూల నక్షత్రం - వారు వేగి చెట్టు ని పెంచడం, పూజించడం ద్వారా పళ్ళ కి సంబంధించిన , మధుమేహం, కొలస్ట్రాల్ వంటి వ్యాధులు అదుపు లో ఉంటాయి. అలాగే జుట్టు రాలడం కూడా నియంత్రణ లో ఉంటుంది. శాస్త్ర ప్రవీణం, మంచి వ్యక్తిత్వము, ఔన్నత్యం కలగడానికి, సంతానం వల్ల జీవితం లో ఆనందాన్ని ఆనందం పొందడానికి ఉపయోగపడుతుంది.

పూర్వాషాడ నక్షత్రం - వారు నిమ్మ లేదా అశోక చెట్లను పెంచడం, పూజించడం ద్వారా కీళ్ళు, సెగగడ్డలు , వాతపు నొప్పులు మరియు జననేంద్రియ సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. దాపరికం లేకుండా వ్యవహరించడానికి పరోపకార బుద్ది . వినయవిదేతలు కలగడానికి ఉపయోగపడుతుంది.

ఉత్తరాషాడ నక్షత్రం - వారు పనస చెట్టు ని పెంచడం, పూజించడం ద్వారా చర్మ సంబంధిత వ్యాధులు దరి చేరవు. అలాగే ఆర్దికం గా కూడా ఎటువంటి సమస్యలు తలెత్తవు. భూముల కి సంబంధించిన వ్యవహారాలు బాగా కలసి వస్తాయి. సంతానపరమైన సమస్యలు ఉన్న వారికి అవి తొలగి వారు మంచి అబివృద్ది లోకి రావడానికి ఉపయోగపడుతుంది.

శ్రవణం నక్షత్రం - వారు జిల్లేడు చెట్టును పెంచడం, పూజించడం ద్వారా మానసిక సమస్యలు దూరమవుతాయి. అలాగే ధనపరమైన సమస్యలు తొలగుతాయి న్యాయం, ధర్మం పాటించేడానికి. కార్యజయం సిద్దించడానికి ఉపయోగపడుతుంది.

ధనిష్ఠ నక్షత్రం - వారు జమ్మి చెట్టును పెంచడం, పూజించడం ద్వారా మెదడు కి సంబంధించిన సమస్యలు రావు. అలాగే వీరికి తెలివి తేటలు, మంచి వాక్చాతుర్యం, ధైర్యం కలగడానికి, కుటుంబ సభ్యుల అండదండల కొరకు, సంతానాబివృద్ధి కొరకు ఉపయోగపడుతుంది.

శతభిషం నక్షత్రం - వారు కడిమి చెట్టు లేదా అరటి చెట్టు ను పెంచడం ద్వారా శరీర పెరుగుదల కి సంబంధిచిన , మోకాళ్ళ సమస్యల నుండి బయటపడతారు. మంచి శరీర సౌష్టవం , చక్కటి ఉద్యోగం కొరకు, జీవితం లో చక్కగా స్థిరపడడానికి ఉపయోగపడుతుంది.

పూర్వాభాద్ర నక్షత్రం - వారు మామిడి చెట్టు ని పెంచడం ద్వారా కండరాలు, పిక్కలకి సంబంధించిన సమస్యలు రావు. వృత్తి ఉద్యోగాలలో మంచి స్థితి ని పొందడానికి . కళలు, సాంస్కృతిక రంగాలలో విశేషమైన పేరును తెచ్చుకోవడానికి, విదేశాల లో తిరిగే అవకాశం కొరకు, ఆర్ధిక స్థిరత్వం కొరకు, రాజకీయాల లో రాణించడానికి ఉపయోగపడుతుంది.

ఉత్తరాభాద్ర నక్షత్రం - వారు వేప చెట్టు ని పెంచడం ద్వారా శ్వాస కోశ బాధలు, కాలేయ సంబంధిత బాధల నుండి రక్షణ లభిస్తుంది. అలాగే విదేశాలలో ఉన్నత విద్యల ను అభ్యసించడానికి, ఉన్నత పదవులు, సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్ఠలు కొరకు, వైవాహిక జీవితం ఎంతో ఆనందం గా ఉండడం కొరకు ఉపయోగపడుతుంది.

రేవతి నక్షత్రం - వారు విప్ప చెట్టు ని పెంచడం, పూజించడం ద్వారా థైరాయిడ్ వంటి వ్యాధులు అదుపు లో ఉంటాయి. మంచి విజ్ఞానం, విన్నూతమైన వ్యాపారాలలో నైపుణ్యం కొరకు, కీలక పదవులు, సంతాన ప్రేమ , గౌరవం అప్యాయతలు వృద్ది చెందడానికి, జీవితం లో అందరి సహాయ సహకారాలు లభించడానికి ఉపయోగపడుతుంది.