Saturday, March 1, 2014

సభ్య సమాజం సాక్షిగా వాస్తు శాస్త్రం కోన ఊపిరితో కొట్టుకుంటుంది .

వాస్తు , జ్యోతిష్యము అనునవి వేరు వేరు శాస్త్రాలు కాదు.  రెండు ఒకే శాస్త్రము నుండి వచ్చినవి మరియు వేదాంగములు కూడాను . ఈ రెండిటి లో ఎ ఓక్కదాన్ని విడచి మరి ఒక దానితో ఏ విషయం గణించ లేము . ఇందులో జ్యోతిష్యం అను నది కొంచం ఆధునిక పండితులకు నూతన విధానాలకి అన్వయించి చెప్పటం సులువుగాను , మరియు ఇతరత్రా కారణాలు కూడా ...! 
కానీ వాస్తు శాస్త్రం అలా కాదు . అసలు నిజానికి మన సనాతన వాస్తు శాస్త్రం లో ఇప్పుడు మన ఆధునిక వాస్తు పండితులు తెలుసుకున్నది 50 % అందులోను వడగలుగు తున్నది 10 % మాత్రమే . ఈ ఆకాశానికి అంటేలా 50 ,100 బహుళ అంతస్తు భావనలు ,కాంక్రీటు అరణ్యము లు  వాస్తు నందు లేవు  . 
 
కేవలం ,ద్వార నిర్ణయం , ఈశాన్యంలో బోరు ,ఆగ్నేయం లో వంటిల్లు ,నైరుతిలో పడకగది . దేవుడి గది ఈశాన్యంలో వుండాలి అని తెలుసుకొని వాస్తు పండితులం అని చెప్పు కునే వారికి తెలిసింది వాస్తు శాస్త్రం కాదు అది  వాస్తు శాస్త్ర సముద్రములో ఒక నీటి బొట్టు మాత్రమె . అర్వణము , భూమి పరీక్షా , శల్యములు , ప్రహరి నిర్ణయం ,వర్గు నిర్ణయం,ఆయము,ఇంటి వాతములు ,భూమిలో జల కనుగోనటం , గర్భ పరిశీలనా , ఇంతే కాక ప్రహరి నుండి మొదలుకొన్ని కప్పు ( ఈ రోజులలో స్లాప్ ) దాక ,కొలతలు,యోగ్య మైన ముహూర్తాలు ఇలా ఎన్నో విషయాలు వాస్తు శాస్త్రం చెపుతుంది . అసలు ఇంటికి ఎన్ని దూలాలు వుండాలి ,అడ్డు వరసలు ,నిలువు వరుసలు వాటి లెక్క ఇవన్ని ఎంతో గణించి నిర్ణయించే వారు పూర్వం పండితులు . అసలు ఈ రోజుల్లో భావి తవ్వించి వరలు దించే వారే కరువయ్యారు .. 
 
అపార్టుమెంట్ సంప్రదాయం . ఇరుకైన రోడ్లు ,ఆధునికతకు పెద్దపీట వేసిన, హంగు,ఆర్భాటాలతో కట్టిన భవంతులు , మహానగరం అని చెప్పుకుని కనీసం మురికి కాలవలు సరిలేని పట్టణాలు , అగ్గిపేట్ట అంత  ఇళ్ళ కట్టడాలు అర్ధం పర్ధం లేని దిక్కులలో నిర్మాణాలు , వీటి అన్నిటి కింద పడి ఏనాడో వాస్తు శాస్త్రం నలిగి కోన ఊపిరితో కొట్టుకుంటుంది . ఇది చాలక , అన్ని తెలుసని అనుకునే మేస్త్రీలు , అవసరాలను కొనే బలహీనత వలన - ఉపేక్షా భావము వహించే యజమానులు . అది బాగోలేదు , ఇది బాగోలేదు , అని తెలిసి తెలియక,ధనార్జనకు , భుక్తి కోసం శాస్త్రాన్ని నమ్ముకో పొగ అమ్ముకునే వారు వాస్తు శాస్త్రాన్ని ఈ సభ్య సమాజం సాక్షిగా ప్రతి రోజు దిగజారుస్తు మిగిలిన ఊపిరి తీస్తున్నారు . 
అలా అని వాస్తు శాస్త్రం ఈ సమాజానికి పనికిరాదని కానీ తెలిసిన పండితులు లేరు అని నేను అనటం లేదు . ఎంతో మంది మహాను భావులు "ఆధునిక వాస్తు శాస్త్రం " పై అధ్యయనం చేసి అపురుప మైన గ్రంధాలను సమాజానికి ఇచ్చారు . వాటిని అనుసరించుకొని మనకు కుదిరినంత వరకు పాటించటానికి ప్రజలు , మిడి మిడి జ్ఞానంతో కాకుండా అభ్యసించి ,అనుభవాన్ని గణించిన తర్వాతే ,వాస్తు శాస్త్ర పండితులుగా వారి సేవలు అందిస్తే కొంచమైన శాస్త్రాలకు విలువ మిగులుతుంది .
సమాజం బాగుపడుతుంది . భారత వేద జ్యోతిష  విజ్ఞాన ఫలాలు భావి తరాల వారికి అందుతాయి .
ఎందరో మహాను భావులు అందరికి వందనాలు .